AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇసుకపై విసుర్లు.. జగన్ ఏమన్నారంటే ?

ఏపీ ప్రభుత్వ ఇసుక విధానంపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై ముఖ్యమంత్రి జగన్ సునిశిత వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇసుక విధానంలో వున్న లోపాల కారణంగా అక్రమంగా ఇసుకను దోచేశారని, అవినీతిని పూర్తిగా అరికట్టి సక్రమంగా ఇసుకను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తుంటే విపక్షాల దారుణంగా ఆరోపణలు చేస్తున్నాయని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలు, పంపిణీపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌.జగన్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. పళ్లు ఇచ్చే చెట్టుమీదే రాళ్లు వేస్తున్నారని జగన్ […]

ఇసుకపై విసుర్లు.. జగన్ ఏమన్నారంటే ?
Rajesh Sharma
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 29, 2019 | 6:10 PM

Share

ఏపీ ప్రభుత్వ ఇసుక విధానంపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై ముఖ్యమంత్రి జగన్ సునిశిత వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇసుక విధానంలో వున్న లోపాల కారణంగా అక్రమంగా ఇసుకను దోచేశారని, అవినీతిని పూర్తిగా అరికట్టి సక్రమంగా ఇసుకను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తుంటే విపక్షాల దారుణంగా ఆరోపణలు చేస్తున్నాయని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలు, పంపిణీపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌.జగన్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు.

పళ్లు ఇచ్చే చెట్టుమీదే రాళ్లు వేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలలో, పంపిణీలలో ఎక్కడైనా అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించానని జగన్ అన్నారు. గతంలో రాబందుల మాదిరిగా ఇసుకను దోచుకున్నవారు ఇపుడు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. వరదల కారణంగా గత 90 రోజులుగా ఆశించిన స్థాయిలో అవసరమైన మేరకు ఇసుకను తీయలేకపోయామని,

వచ్చే వారానికి వరదలు తగ్గే అవకాశం వున్నందున ఇసుక పంపిణీ వేగవంతమవుతుందని జగన్ అన్నారు. వరదలు తగ్గిన తర్వాత ఇసుక వారోత్సవం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వారోత్సవంలో భాగంగా వారం రోజులు ఇసుకమీదే పనిచేద్దామని సీఎం అధికారులకు సూచించారు. ఇసుక గురించి మళ్లీ ఎవ్వరూ మాట్లాడకుండా చూడాలని సీఎం అన్నారు.

దుష్ప్రచారాలను వెంటనే ఖండించండి: సీఎం జగన్

ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదని, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి పహరా ఉండాలని, డీజీపీ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించాలని జగన్ ఆదేశించారు. ఎంత బాగా చేస్తున్నా.. విమర్శలు వస్తున్నాయని, అందుకే వాటిపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఇంతకు ముందు అవినీతి, మాఫియాలతో ఇసుకను తరలించేవారని,

ఇప్పుడు ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి, అన్ని చోట్లా యంత్రాలు కాకుండా మాన్యువల్‌గా పనులు చేయాలని జగన్ ఆదేశించారు. దాని వల్ల భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని దొరుకుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పనులు దొరకలేదన్న… ఇష్యూ ఇక్కడ తలెత్తదని, వరదలు తగ్గేలోగా వాగులు, వంకల్లో సుమారు 70 చోట్ల రీచ్‌లను గుర్తించాలని, గ్రామ సచివాలయంలో ఎవరైనా చలానా కట్టి, 20 కి.మీవరకూ ట్రాక్టర్‌ ద్వారా ఇసుక తరలించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.

కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?