కరోనా టెస్ట్ నెగిటివ్ వచ్చినా..రోగి కళ్లె, మలంలో వైరస్
కరోనాకు ఇంకా మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ కనుగొనలేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోన్న ప్రపంచ వైద్య నిపుణులకు, శాస్త్రవేత్తలకు కరోనా(కోవిడ్-19) వైరస్ కొత్త సవాళ్లను విసురుతోంది. చైనాలో ఇటీవల వెలువడిన ఓ షాకింగ్ న్యూస్ ..అందరినీ కలవరపెడుతోంది. ఇటీవల కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయిన కొందరి పేషెంట్స్ నుంచి సేకరించిన కళ్లె, మలం నమూనాల్లో మహమ్మారి కరోనా వైరస్ను గుర్తించారు చైనా డాక్టర్లు. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్లో ఈ రీసెర్చ్ ప్రచురితమైంది. […]
కరోనాకు ఇంకా మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ కనుగొనలేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోన్న ప్రపంచ వైద్య నిపుణులకు, శాస్త్రవేత్తలకు కరోనా(కోవిడ్-19) వైరస్ కొత్త సవాళ్లను విసురుతోంది. చైనాలో ఇటీవల వెలువడిన ఓ షాకింగ్ న్యూస్ ..అందరినీ కలవరపెడుతోంది. ఇటీవల కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయిన కొందరి పేషెంట్స్ నుంచి సేకరించిన కళ్లె, మలం నమూనాల్లో మహమ్మారి కరోనా వైరస్ను గుర్తించారు చైనా డాక్టర్లు. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్లో ఈ రీసెర్చ్ ప్రచురితమైంది.
కోవిడ్ ఎఫెక్ట్ అయిన వ్యక్తిని హాస్పిటల్ నుంచి డిచ్చార్జ్ చేసేముందు..ఎక్కువగా కఫం ద్వారా టెస్టులు చేస్తారు. ఆ రిజల్ట్స్ బట్టి సదరు వ్యక్తి క్వారంటైన్లో ఉండాల్సింది..లేనిది డిసైడ్ చేస్తారని చైనాలోని క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటి పరిశోధలుకు తెలిపారు.
వచ్చిన రిజల్ట్స్ సరైనవేనా.. లేక బాడీలోని ఇతర భాగాల నుంచి శాంపిల్స్ సేకరించాలా అనే విషయంపై పరిశోధకులు చర్చలు జరుపుతున్నారు. టెస్టుల్లో కోవిడ్ నెగిటివ్గా తేలిన తర్వాత కూడా కొందరు రోగుల కళ్లెలో 39 రోజులు, మలంలో 13 రోజుల పాటు ఈ డేంజరస్ వైరస్ ఉంటున్నట్లు గుర్తించారు. వచ్చిన రిజల్ట్స్ ప్రకారం..రోగి ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందుతుందనే విషయంపై క్లారిటీ లేదని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయంపై మరింత అధ్యయనం అవసరమని వారు అభిప్రాయపడతున్నారు.