Social Media Ban: సోషల్ మీడియా పై అండర్ 16 బ్యాన్ సాధ్యమేనా..?
భారత్లో పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనం పెరుగుతున్న నేపథ్యంలో, అండర్-16 వయస్సు వారికి నిషేధం విధించే ఆలోచన తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, ఈ నిషేధం అమలు ఎంతవరకు సాధ్యం, ఎదురయ్యే సవాళ్లు ఏంటి అనే దానిపై నిపుణులు, ప్రభుత్వాలు విస్తృతంగా చర్చిస్తున్నాయి.
భారత్లో పిల్లల్లో సోషల్ మీడియా వినియోగం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, 16 ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించే అంశం జాతీయ చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఈ దిశగా ముందడుగు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 13 లేదా 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధించే అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో మంత్రి లోకేష్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం అసెంబ్లీలో 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. స్మార్ట్ఫోన్ల మితిమీరిన వాడకం వల్ల పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు పెరుగుతున్నాయని, ప్రతికూల ప్రభావాలను నివారించడమే ఈ నిర్ణయం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: భారీగా పడిపోయిన దుబాయ్లో బంగారం ధర.. అబ్బా కొనుకున్నవారికి కొనుకున్నంత
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..

