ఏపీలో కరోనా కల్లోలం.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..

|

Jul 20, 2020 | 1:15 AM

Corona Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా అధికారులు లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. ఇక తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం, నరసాపురం, కొవ్వూరులో లాక్ డౌన్ అమలు చేయనున్నారు. లాక్ డౌన్ […]

ఏపీలో కరోనా కల్లోలం.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..
Follow us on

Corona Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా అధికారులు లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. ఇక తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.

ఇవాళ్టి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం, నరసాపురం, కొవ్వూరులో లాక్ డౌన్ అమలు చేయనున్నారు. లాక్ డౌన్ సమయంలో ఉదయం 6 గంటల నుంచి 11 వరకు నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే ఉదయం 11 గంటల తర్వాత నుంచి షాపులు మూసేవేయాలని.. అత్యవసరం తప్పితే బయటికి రాకూడదని పోలీసులు హెచ్చరించారు.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..

సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..

2.5 కోట్ల ఇరానీయులకు కరోనా.. దేశాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..