AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీఎస్‌ఎన్‌ఎల్‌ మౌనరాగంతో ఉద్యోగులకు ఉద్వాసన..!

ప్రస్తుతం ప్రపంచాన్ని నడిస్తున్నది ఆధునిక టెక్నాలజీ..టెలికాం రంగంలో పుట్టుకొచ్చిన కొత్త టెక్నాలజీ..ఒకనాటి ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ గొంతు నొక్కేసింది. కోట్లాది భారత ప్రజలకు తొలుత టెలిఫోన్‌ సేవలను పరిచయం చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. ప్రైవేట్‌ టెలికాం కంపెనీల ధరల యుద్ధంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం జీవన్మరణ పోరాటం చేస్తోంది. తాను బతికేందుకు కావాల్సిన జవసత్వాలను తిరిగి పుంజుకునే క్రమంలో..సంస్థంపై ఆధారపడ్డి జీవనోపాధిని పొందుతున్నవేలాది ఉద్యోగుల భవిష్యత్‌ను ఫణంగా పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు టెలికాం రంగంలో ఓ వెలుగు […]

బీఎస్‌ఎన్‌ఎల్‌ మౌనరాగంతో ఉద్యోగులకు ఉద్వాసన..!
Pardhasaradhi Peri
|

Updated on: Sep 07, 2019 | 2:30 PM

Share

ప్రస్తుతం ప్రపంచాన్ని నడిస్తున్నది ఆధునిక టెక్నాలజీ..టెలికాం రంగంలో పుట్టుకొచ్చిన కొత్త టెక్నాలజీ..ఒకనాటి ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ గొంతు నొక్కేసింది. కోట్లాది భారత ప్రజలకు తొలుత టెలిఫోన్‌ సేవలను పరిచయం చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. ప్రైవేట్‌ టెలికాం కంపెనీల ధరల యుద్ధంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం జీవన్మరణ పోరాటం చేస్తోంది. తాను బతికేందుకు కావాల్సిన జవసత్వాలను తిరిగి పుంజుకునే క్రమంలో..సంస్థంపై ఆధారపడ్డి జీవనోపాధిని పొందుతున్నవేలాది ఉద్యోగుల భవిష్యత్‌ను ఫణంగా పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)అయితే,..ఎయిర్‌టెల్‌, ఐడియా లాంటి సంస్థలు వచ్చాక..వాటితో పోటీ పడలేకపోయింది. తాజాగా వచ్చిన రిలయన్స్‌ జియో..మిగతా టెలికాం సంస్థలన్నింటికీ గట్టి పోటీ ఇవ్వడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చేసింది. రూ. 15 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. దాంతో ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ..వాలంటరీ రిటైర్మెంట్‌ స్కీం తెస్తోంది. దాదాపు 80 వేల మంది ఉద్యోగులను స్వచ్చంద పదవీ విరమణ ద్వారా తొలగించబోతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. పర్మిషన్‌ రాగానే ఉద్యోగులను తొలగించే పని మొదలుపెడతామని బీఎస్‌ఎన్‌ఎల్‌ చీఫ్‌ ప్రవీణ్‌ కుమార్‌ పర్వార్‌ తెలలిపారు. రిటైర్మెంట్‌ స్కీమ్‌ అమలైన తర్వాత లక్షల్లో శాలరీలు తీసుకుంటున్న సీనియర్లు చాలా మంది సంస్థ నుంచీ బయటకు వెళ్లిపోయారు. అదే సమయంలో బీఎస్‌ఎన్ఎల్‌ కొత్తగా లక్ష మందిని నియమించుకోనుంది. ఐతే..వాళ్లందరికీ తక్కువ శాలరీలే ఉంటాయి. అలాగే మరికొంత మందిని కాంట్రాక్ట్‌ పద్దతుల్లో తీసుకుంటుంది. అందువల్ల సంస్థలో నిర్వహణ భారం దాదాపు సగం తగ్గుతుంది. ఈ కారణంగా రిటైర్మెంట్‌ తీసుకునేవారికీ భారీగా క్యాష్‌ రివార్డ్‌ ఇస్తామని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఇదిలా ఉంటే..వీలైనంత మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ను ఎంచుకునే పరిస్థితులు కల్పించేందుకే గత కొంతకాలంగా జీతాల చెల్లింపును ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

Follow Us
పెళ్లిళ్ల సీజన్ వేళ బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
పెళ్లిళ్ల సీజన్ వేళ బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుమ్మడి జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుమ్మడి జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో..
Video: తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన 41 ఏళ్ల ప్లేయర్
Video: తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన 41 ఏళ్ల ప్లేయర్
గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను విస్మరించవద్దు..
గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను విస్మరించవద్దు..
చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు
చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు
కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
విద్యార్థులకు అలర్ట్.. సిలబస్‌లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి..
విద్యార్థులకు అలర్ట్.. సిలబస్‌లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి..
రత్నగిరి రాళ్లలో 12,000ఏళ్ల రహస్యం!చరిత్రనే మార్చే సంచలన తవ్వకాలు
రత్నగిరి రాళ్లలో 12,000ఏళ్ల రహస్యం!చరిత్రనే మార్చే సంచలన తవ్వకాలు
మేం చనిపోయాక మా డెడ్ బాడీస్‌ వారికే సొంతం: బిగ్ బాస్ సోనియా
మేం చనిపోయాక మా డెడ్ బాడీస్‌ వారికే సొంతం: బిగ్ బాస్ సోనియా
ఇండియా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌‌.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..
ఇండియా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌‌.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..