AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీఎస్‌ఎన్‌ఎల్‌ మౌనరాగంతో ఉద్యోగులకు ఉద్వాసన..!

ప్రస్తుతం ప్రపంచాన్ని నడిస్తున్నది ఆధునిక టెక్నాలజీ..టెలికాం రంగంలో పుట్టుకొచ్చిన కొత్త టెక్నాలజీ..ఒకనాటి ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ గొంతు నొక్కేసింది. కోట్లాది భారత ప్రజలకు తొలుత టెలిఫోన్‌ సేవలను పరిచయం చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. ప్రైవేట్‌ టెలికాం కంపెనీల ధరల యుద్ధంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం జీవన్మరణ పోరాటం చేస్తోంది. తాను బతికేందుకు కావాల్సిన జవసత్వాలను తిరిగి పుంజుకునే క్రమంలో..సంస్థంపై ఆధారపడ్డి జీవనోపాధిని పొందుతున్నవేలాది ఉద్యోగుల భవిష్యత్‌ను ఫణంగా పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు టెలికాం రంగంలో ఓ వెలుగు […]

బీఎస్‌ఎన్‌ఎల్‌ మౌనరాగంతో ఉద్యోగులకు ఉద్వాసన..!
Pardhasaradhi Peri
|

Updated on: Sep 07, 2019 | 2:30 PM

Share

ప్రస్తుతం ప్రపంచాన్ని నడిస్తున్నది ఆధునిక టెక్నాలజీ..టెలికాం రంగంలో పుట్టుకొచ్చిన కొత్త టెక్నాలజీ..ఒకనాటి ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ గొంతు నొక్కేసింది. కోట్లాది భారత ప్రజలకు తొలుత టెలిఫోన్‌ సేవలను పరిచయం చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. ప్రైవేట్‌ టెలికాం కంపెనీల ధరల యుద్ధంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం జీవన్మరణ పోరాటం చేస్తోంది. తాను బతికేందుకు కావాల్సిన జవసత్వాలను తిరిగి పుంజుకునే క్రమంలో..సంస్థంపై ఆధారపడ్డి జీవనోపాధిని పొందుతున్నవేలాది ఉద్యోగుల భవిష్యత్‌ను ఫణంగా పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)అయితే,..ఎయిర్‌టెల్‌, ఐడియా లాంటి సంస్థలు వచ్చాక..వాటితో పోటీ పడలేకపోయింది. తాజాగా వచ్చిన రిలయన్స్‌ జియో..మిగతా టెలికాం సంస్థలన్నింటికీ గట్టి పోటీ ఇవ్వడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చేసింది. రూ. 15 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. దాంతో ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ..వాలంటరీ రిటైర్మెంట్‌ స్కీం తెస్తోంది. దాదాపు 80 వేల మంది ఉద్యోగులను స్వచ్చంద పదవీ విరమణ ద్వారా తొలగించబోతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. పర్మిషన్‌ రాగానే ఉద్యోగులను తొలగించే పని మొదలుపెడతామని బీఎస్‌ఎన్‌ఎల్‌ చీఫ్‌ ప్రవీణ్‌ కుమార్‌ పర్వార్‌ తెలలిపారు. రిటైర్మెంట్‌ స్కీమ్‌ అమలైన తర్వాత లక్షల్లో శాలరీలు తీసుకుంటున్న సీనియర్లు చాలా మంది సంస్థ నుంచీ బయటకు వెళ్లిపోయారు. అదే సమయంలో బీఎస్‌ఎన్ఎల్‌ కొత్తగా లక్ష మందిని నియమించుకోనుంది. ఐతే..వాళ్లందరికీ తక్కువ శాలరీలే ఉంటాయి. అలాగే మరికొంత మందిని కాంట్రాక్ట్‌ పద్దతుల్లో తీసుకుంటుంది. అందువల్ల సంస్థలో నిర్వహణ భారం దాదాపు సగం తగ్గుతుంది. ఈ కారణంగా రిటైర్మెంట్‌ తీసుకునేవారికీ భారీగా క్యాష్‌ రివార్డ్‌ ఇస్తామని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఇదిలా ఉంటే..వీలైనంత మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ను ఎంచుకునే పరిస్థితులు కల్పించేందుకే గత కొంతకాలంగా జీతాల చెల్లింపును ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..