పెళ్లైన కొద్ది గంటలకే నవ వధువు ఆత్మహత్య

నవవధువును అత్తారింటికి అనందంగా సాగనంపారు. వెళ్లే దారిలో ఓ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది పెళ్లికూతురు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్‌లో చోటు చేసుకుంది.

పెళ్లైన కొద్ది గంటలకే నవ వధువు ఆత్మహత్య
Follow us

|

Updated on: Jun 15, 2020 | 12:31 PM

అప్పటి వరకు అంగరంగ వైభవంగా వివాహ వేడుక సంబురంగా జరిగింది. అప్పగింతలు పూర్తి చేసి.. నవవధువును అత్తారింటికి అనందంగా సాగనంపారు. వెళ్లేదారిలో ఓ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది పెళ్లికూతురు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్‌లో చోటు చేసుకుంది. రాజస్తాన్‌ అలపుర్‌కు చెందిన ఓ యువతికి ఆదివారం బంధువులు సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లైంది. ఆ తర్వాత ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పెళ్లి కూతురిని అత్తారింటికి సాగనంపారు పుట్టింటివారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో కారు మధ్యప్రదేశ్‌, షియోపూర్‌ చంబల్‌ నది వంతెనపై ప్రయాణిస్తుంది. అంతలొనే తనకు వాంతి వస్తోందని, కారు ఆపాలని వధువు డ్రైవర్‌ను కోరింది. అయితే డ్రైవర్‌ అనుమానపడుతూనే అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఒక్కసారిగా స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకుని తిప్పేసింది. దీంతో డ్రైవర్ సడన్ బ్రేకులు వేశాడు. పెళ్లికుమారుడు, అతడి తల్లిదండ్రులు ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే వధువు కారులోంచి కిందకి దిగి, వంతెనపై నుంచి నదిలోకి దూకేసింది. ఈ హఠాత్తు పరిణామంతో వరుడుతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గజఈతగాళ్ల సాయంతో వధువు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెళ్లి జరిగే సమయంలో అంతా బాగానే ఉందని.. తమ కూతురు కూడా సంతోషంగానే ఉందన్నారు వధువు తల్లిదండ్రులు. ఇంతలో ఏం జరిగిందో తమకు తెలియడం లేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.