AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షిర్డీలో భక్తుల అదృశ్యం.. ఏమిటా రహస్యం?

షిర్డీలో భక్తుల అదృశ్యంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయాలని ముంబై హైకోర్టు శనివారం ఆదేశించింది. “షిర్డీ నుండి ఒక సంవత్సరంలో 88 మంది తప్పిపోయారు” అని కోర్టు తెలిపింది. ఈ కేసులో మానవ అక్రమ రవాణా ముఠాల ప్రమేయం ఉన్నట్లు హైకోర్టు అనుమానిస్తోంది. ఈ విషయాన్ని పరిశీలించాలని ముంబై హైకోర్టు ధర్మాసనం అహ్మద్‌నగర్ పోలీసు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇండోర్‌లో నివసిస్తున్న మనోజ్ కుమార్ సోని గత ఏడాది ముంబై హైకోర్టులో పిటిషన్ […]

షిర్డీలో భక్తుల అదృశ్యం.. ఏమిటా రహస్యం?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 16, 2019 | 6:24 PM

Share

షిర్డీలో భక్తుల అదృశ్యంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయాలని ముంబై హైకోర్టు శనివారం ఆదేశించింది. “షిర్డీ నుండి ఒక సంవత్సరంలో 88 మంది తప్పిపోయారు” అని కోర్టు తెలిపింది. ఈ కేసులో మానవ అక్రమ రవాణా ముఠాల ప్రమేయం ఉన్నట్లు హైకోర్టు అనుమానిస్తోంది. ఈ విషయాన్ని పరిశీలించాలని ముంబై హైకోర్టు ధర్మాసనం అహ్మద్‌నగర్ పోలీసు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇండోర్‌లో నివసిస్తున్న మనోజ్ కుమార్ సోని గత ఏడాది ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, 2017 ఆగస్టులో అతని కుటుంబం షిర్డీని సందర్శించినప్పుడు అతని భార్య తప్పిపోయిందని పేర్కొన్నారు. ఈ కేసుపై తదుపరి విచారణ 2020 జనవరి 10 న జరుగనుంది.