AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెంపుల్ ట్రెండ్ పాలిటిక్స్: హైదరాబాద్ తరహాలో వరంగల్ లోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యూహరచన.!

వరంగల్ లో కార్పొరేషన్ పై కన్నేసిన బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ టెంపుల్ ట్రెండ్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. హైదరాబాద్..

టెంపుల్ ట్రెండ్ పాలిటిక్స్: హైదరాబాద్ తరహాలో వరంగల్ లోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యూహరచన.!
Venkata Narayana
|

Updated on: Jan 06, 2021 | 4:30 PM

Share

వరంగల్ లో కార్పొరేషన్ పై కన్నేసిన బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ టెంపుల్ ట్రెండ్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. హైదరాబాద్ తరహాలోనే ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం భద్రకాళి అమ్మవారి ఆలయమే వేదికగా అక్కడి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు బహిరంగ సవాల్ విసిరారు. స్మార్ట్ సిటీ నిధుల మల్లింపు వ్యవహారంలో భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరిన బండి.. తన సవాల్ ను స్వీకరించడానికి 48 గంటల గడువు విధించారు. దమ్ముంటే తన సవాల్ కు స్పందించి వరంగల్ ప్రజాప్రతినిధులు భద్రకాళి అమ్మవారి సన్నిధిలో తాడోపేడో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు బీజేపీ నాయకత్వంలో కొత్త ఉత్సాహాన్ని నింపిన సంగతి తెలిసిందే. టెంపుల్ ట్రెండ్ పాలిటిక్స్ తో ప్రత్యర్ధులను ఇరకాటంలో పెడుతున్న బీజేపీ రాష్ట్ర రథ సారథి బండి సంజయ్, ఇదే సెంటిమెంట్ ను వరంగల్ లోనూ వర్కవుట్ చేయాలని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో భాగ్యలక్ష్మీ అమ్మవారి టెంపుల్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా బీజేపీ పాలిటిక్స్ సాగగా… ఇప్పుడు వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భద్రకాళి అమ్మవారి ఆలయం మరోసారి వేదికగా మారనుంది.