మరికాసేపట్లో బీహార్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 55 కేంద్రాల్లో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. 243 అసెంబ్లీ స్థానాలకుగాను 3 దశల్లో జరిగిన పోలింగ్ కు సంబంధించి, ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. అనంతరం ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ చేస్తారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో 414 హాళ్లు […]

బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 55 కేంద్రాల్లో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. 243 అసెంబ్లీ స్థానాలకుగాను 3 దశల్లో జరిగిన పోలింగ్ కు సంబంధించి, ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. అనంతరం ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ చేస్తారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో 414 హాళ్లు సిద్ధం కాగా.. ఒక్కో హాల్కు 7 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ పోటీచేస్తున్న రాఘోపుర్ ఫలితంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. హసన్పుర్ నుంచి తేజస్వీ సోదరుడు తేజ్ప్రతాప్ యాదవ్ బరిలో నిలిచారు. మహాకుటమికే బీహార్ ప్రజలు పగ్గాలు అప్పగించనున్నారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కట్టిన సంగతి తెలిసిందే.