దశాబ్దాలపాటు సాగిన రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు 40 రోజుల పాటు సాగించిన రోజువారీ విచారణ బుధవారంతో ముగిసింది. తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నవంబర్ 17వ తేదీకి ముందే తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కేసులో సంబంధిత పార్టీలు లిఖిత పూర్వక నివేదనలు అందజేసేందుకు సుప్రీం ధర్మాసనం మరో మూడు రోజుల గడువు ఇచ్చింది. అయోధ్య కేసులో బుధవారంనాడు విచారణ సందర్భంగా, ఈ కేసుకు ముగింపు పలకనున్నట్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు.
రామజన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో వాదనలు సాయంత్రం 5 గంటలతో ముగుస్తాయని చెప్పారు. ‘విచారణ ముగింపు దశకు వచ్చింది. ఇప్పటి వరకూ జరిగింది చాలు’ అని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి సారధ్యం వహిస్తున్న రంజన్ గొగోయ్ అన్నారు. అయితే, ఆయన చెప్పిన గడువు కంటే గంట ముందుగానే మధ్యాహ్నం 4 గంటలకు విచారణ ముగిసింది. ఈ కేసులో ఇవాల్టితో 40 రోజుల పాటు రోజవారీ విచారణను ధర్మాసనం చేపట్టింది. నవంబర్ 17న సీజేఐ పదవీ విరమణ చేయనుండడంతో ఆలోపే తీర్పు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Supreme Court says that the rest of the submissions can be made in written form in the next 3 days. https://t.co/wT0mDILrID
— ANI (@ANI) October 16, 2019
Breaking: After a marathon hearing that went on for a record 40 days, the Supreme Court today reserves judgment in the Ayodhya matter.#AyodhyaHearing #AyodhyaCase pic.twitter.com/3TIVlHDTS6
— The Leaflet (@TheLeaflet_in) October 16, 2019