AP Secretariat Exams Hall Tickets: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్ధులకు ముఖ్య గమనిక. రాత పరీక్షలకు ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో హాల్టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఉదయం, మధ్యాహ్నం ఒక్కొక్కటి చొప్పున 14 రకాల రాత పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి కోసం పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఓఎంఆర్ షీట్లల ముద్రణ వంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.
కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లోని మొత్తం 16,208 పోస్టులకు సుమారు 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ రాత పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మూడు నుంచి ఐదు వేల పరీక్షా కేంద్రాలలో.. అభ్యర్ధుల మధ్య తగిన దూరం ఉండటంతో పాటు.. ఒక గదిలో 16 మంది చొప్పున సీటింగ్ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
హాల్టికెట్ల కోసం http://gramasachivalayam.ap.gov.in/ అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించండి.
రాతపరీక్షల షెడ్యూల్ ఇలా..