AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందరికీ ఆరోగ్యశ్రీ.. కోలుకునే సమయంలోనూ ఆర్థికసాయం..

కోవిద్-19 సంక్షోభ సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో ఆరోగ్యశ్రీలో జబ్బుల సంఖ్య పెరిగింది, వార్షికాదాయ పరిమితీ పెరిగింది.

అందరికీ ఆరోగ్యశ్రీ.. కోలుకునే సమయంలోనూ ఆర్థికసాయం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 15, 2020 | 7:41 AM

కోవిద్-19 సంక్షోభ సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో ఆరోగ్యశ్రీలో జబ్బుల సంఖ్య పెరిగింది, వార్షికాదాయ పరిమితీ పెరిగింది. అన్నిటికీ మించి శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో రోజుకు రూ.225 చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుండటం దేశ చరిత్రలో తొలిసారి. వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సీఎం వైఎస్ జగన్‌‌ ఆదేశాలు జారీచేశారు. దీంతో గురువారం నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించ‌నుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర రాష్ట్రాలలోనూ చికిత్సలు పొందే వీలు కల్పించింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల్లో 716 సూపర్‌ స్పెషాలిటీ చికిత్సలు పొందే వీలు కల్పించింది. తెల్లకార్డు ఉన్నా లేకపోయినా రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారందరికీ పథకం వర్తింపచేయడంతో 95 శాతం పైగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు. కోవిడ్‌ చికిత్సను తొలిసారిగా ఆరోగ్యశ్రీలో చేర్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం గమనార్హం. కనిష్టంగా రూ.16 వేల నుంచి రూ.2 లక్షల పైచిలుకు వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీకార్డుతో పనిలేకుండా ఎవరైనా ఉచితంగా చికిత్స పొందవచ్చు.