AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఈ నెల 26న ఏపీ ఎంసెట్ ‘కీ’

ఏపీ ఎంసెట్ 2020 ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత ఉన్నప్పటికీ మొత్తం 84. 38 శాతం మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరైనట్లు...

విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఈ నెల 26న ఏపీ ఎంసెట్ 'కీ'
Ravi Kiran
|

Updated on: Sep 24, 2020 | 5:40 PM

Share

ఏపీ ఎంసెట్ 2020 ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత ఉన్నప్పటికీ మొత్తం 84. 38 శాతం మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరైనట్లు ఉన్నత విద్యామండలి ప్రత్యేకాధికారి(ఏపీ సెట్స్‌) డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డి తెలిపారు. ఎంసెట్‌–2020 ప్రాథమిక ‘కీ’ని ఈనెల 26న విడుదల చేస్తామని ఆయన అన్నారు.

దానిపై అభ్యంతరాలు ఈ నెల 28 వరకు స్వీకరించి.. తర్వాత తుది ‘కీ’ని విడుదల చేయనున్నట్లు ఎం.సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, నిన్నటి నుంచి మూడు రోజుల పాటు ఈ నెల 23, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా, మెడికల్‌ విభాగం ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విభాగంలో 87,637 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. (AP Eamcet 2020)

Also Read:

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..