విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్కు వెళ్లకుండానే పది పరీక్షలు.!
ఇకపై స్కూల్కు వెళ్లకుండానే పది పరీక్షలు రాయొచ్చు.? స్కూల్లో చేరకుండానే నేరుగా ఎస్ఎస్సీ బోర్డుకు పరీక్ష ఫీజు చెల్లించి ఎగ్జామ్స్ రాసే వెసులుబాటును ఈ విద్యా సంవత్సరం(2020-21)లో...
ఇకపై స్కూల్కు వెళ్లకుండానే పది పరీక్షలు రాయొచ్చు.? స్కూల్లో చేరకుండానే నేరుగా ఎస్ఎస్సీ బోర్డుకు పరీక్ష ఫీజు చెల్లించి ఎగ్జామ్స్ రాసే వెసులుబాటును ఈ విద్యా సంవత్సరం(2020-21)లో కల్పించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాయాలంటే తప్పకుండా ఏదొక స్కూల్లో చదవాలి. ఈ నిబంధన అన్ని చోట్లా ఉంది. అయితే కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. అంతేకాదు చాలామంది కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోయాయి. దీనితో ఇప్పటివరకు ప్రైవేట్ స్కూళ్లలో చదివిన విద్యార్ధుల కుటుంబాలకు ఫీజులు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటికే ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి.. మరికొన్ని అయితే ఇప్పుడు చూసీ చూడనట్లు వదిలేసినా.. చివరికి మొత్తం ఫీజు చెల్లిస్తేనే ఫైనల్ ఎగ్జామ్స్కు అనుమతించే పరిస్థితులు కనిపిస్తున్నాయని విద్యాశాఖ భావిస్తోంది. అందుకే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టలేనివాళ్లు చదువు మధ్యలోనే ఆపేయకూడదనే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయంపై చర్చించినట్లు సమాచారం. కాగా, స్కూల్ చేరకుండానే నేరుగా టెన్త్ పరీక్షలు రాసే సదుపాయం 2015 వరకు అమల్లోనే ఉంది. అయితే ఆ సమయంలో అంతర్గత మార్కులు ప్రవేశపెట్టడంతో ఈ విధానాన్ని విద్యాశాఖ రద్దు చేసింది. ఇక ఇప్పుడు ఆ అంతర్గత మార్కులు రద్దు చేస్తే.. నేరుగా పరీక్ష రాసే విధానాన్ని అమలు చేయవచ్చునని కొందరు అధికారులు చెబుతున్నారు. మరి చివరిగా విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. (Telangana Educational Ministry)
Also Read:
శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..