ముందుకు వెళ్లేదెలా ? .. పోలవరంపై సీఎం జగన్ సమీక్ష
ఏపీ రాజకీయాల్లో పోలవరం రాజకీయ దుమారాన్ని రాజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విధానాలతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశాలున్నాయంటూ పీపీఏ ఒక నివేదికను కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టుగా ఉన్న పోలవరం నిర్మాణంలో అడుగడుగునా ప్రతికూలతలు ఎదురవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. హైడల్ ప్రాజెక్టుపై నవయుగ సంస్ధ కోర్టులో కేసు వేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అనుకున్న […]
ఏపీ రాజకీయాల్లో పోలవరం రాజకీయ దుమారాన్ని రాజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విధానాలతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశాలున్నాయంటూ పీపీఏ ఒక నివేదికను కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టుగా ఉన్న పోలవరం నిర్మాణంలో అడుగడుగునా ప్రతికూలతలు ఎదురవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. హైడల్ ప్రాజెక్టుపై నవయుగ సంస్ధ కోర్టులో కేసు వేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అనుకున్న విధంగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇదే విషయాలను అధికారులతో సీఎం చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న విషయాల్లో అధికారులనుంచి సలహాలు తీసుకున్నారు. న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలనుంచి బయటపడే విషయాలపై కూడా సమీక్షించినట్టు సమాచారం.