AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: సుశాంత్ కుటుంబంలో మరో విషాదం..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ మరణాన్నిజీర్ణించుకోలేని అతని వదిన సుధాదేవి బీహార్‌లోని పూర్ణియాలో కన్నుమూశారు.

బ్రేకింగ్: సుశాంత్ కుటుంబంలో మరో విషాదం..
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 16, 2020 | 10:47 AM

Share

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ మరణాన్నిజీర్ణించుకోలేని అతని వదిన సుధాదేవి బీహార్‌లోని పూర్ణియాలో కన్నుమూశారు. ముంబైలో కుటుంబసభ్యులు సుశాంత్ అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. సుశాంత్ మరణవార్త తెలిసినప్పటికీ నుంచి ఆమె అన్నపానీయాలు తీసుకోవడం లేదని సమాచారం.

కాగా, ఆదివారం ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) అంత్యక్రియలు ముంబయిలోని విలే పార్లే శ్మశానవాటికలో ముగిశాయి. ఈ సందర్బంగా బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు ఆయనకు చివరిసారిగా నివాళులు అర్పించారు. ముంబయిలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, తమ ఆత్మీయుడి చివరి చూపు కోసం కొందరు వెళ్లారు. మరి కొందరు ఆసుపత్రికి వెళ్లి నివాళులు అర్పించారు. అటు సుశాంత్ బాలీవుడ్ పెద్దలు పెట్టిన మానసిక ఒత్తిళ్లు కారణంగా చనిపోయాడని పలువురు సినీ ప్రముఖులు మండిపడ్డారు.

Also Read: సుశాంత్‌ను చంపింది వాళ్లే.. కంగనా సంచలన వ్యాఖ్యలు..