AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1,886 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 67,910 కరోనా టెస్టులు చేయగా 1,886 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యంది.

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1,886 పాజిటివ్ కేసులు
Balaraju Goud
|

Updated on: Nov 10, 2020 | 6:51 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 67,910 కరోనా టెస్టులు చేయగా 1,886 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,46,245 కి చేరుకుంది. అయితే, ఇందులో 20,958 యాక్టివ్ కేసులుండగా 8,18,473 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 2,151 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు ఒక్కరోజులో  కరోనాతో బారినపడి 12 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 6,802కి చేరుకుంది.

ఇక, గత 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి కృష్ణా జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లా,పశ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు, విశాఖపట్నం, అనంతపూర్, ప్రకాశం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 60, చిత్తూరులో 291, ఈస్ట్ గోదావరిలో 227, గుంటూరులో 275, కడపలో 67, కృష్ణాలో 269, కర్నూల్ లో 33, నెల్లూరులో 79, ప్రకాశంలో 111, శ్రీకాకుళం 33, విశాఖపట్నం 97, విజయనగరం 62, వెస్ట్ గోదావరి 282 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 87,92,935 కరోనా టెస్టులు నిర్వహించారు.