AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !

నేటి నుంచి ఏపీ  అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. 

AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !
Ram Naramaneni
|

Updated on: Nov 30, 2020 | 9:27 AM

Share

నేటి నుంచి ఏపీ  అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.  తొలి రోజు 11 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. వీటితోపాటు మరికొన్ని కొత్త చట్టాలు, చట్టసవరణలకు సంబంధించిన 30 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు పనులు, నాడు-నేడు పనితీరు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారపక్షం సభ ద్వారా ప్రజలకు వివరించనుంది.

ఇక ప్రతిపక్ష టీడీపీ కూడా తన వ్యూహాలకు పదునుపెట్టింది. ముఖ్యంగా పంట నష్టం, రైతుల సమస్యలపై ప్రతిపక్ష పార్టీ ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. ఇక ప్రజలపై మోపుతోన్న పన్నలు భారం, టిడ్కో ఇళ్ల పంపిణీ అంశాలను హైలెట్ చేయనున్నారు. ఇలా మొత్తం 15 అంశాలపై టీడీపీ చర్చకు పట్టుబట్టనుంది.  పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గత కొంతకాలంగా ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీ…ఆయా అంశాలను సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ మీటింగ్స్ జరిగినన్ని రోజులూ సభ ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణ బయట రోజుకో అంశంపై నిరసన కార్యక్రమం చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. అసెంబ్లీ సమవేశాలు కనీసం 10 రోజులైనా నిర్వహించాలని ప్రతిపక్ష టీడీపీ డిమాండ్‌ చేస్తుండగా….ఎన్నిరోజులైనా నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు.

Also Read : Ind vs Aus : రెండో వన్డే​లో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు