అనసూయ కొత్త చిత్రం ‘థ్యాంక్ యూ బ్రదర్’ టైటిల్ పోస్టర్ లాంచ్..
కరోనా కాలానికి సంబంధించిన కాల్పనిక ఘటనలను ఆధారం చేసుకొని క్రియేటివ్ జీనియస్ రమేష్ రాపర్తి 'థ్యాంక్ యు బ్రదర్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు..
Anasuya Bharadwaj: కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవ్థను, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని తీవ్రంగా దెబ్బతీసింది. అయితే కళాకారుల తపనను అది దెబ్బతీయలేకపోయింది. ఆ కరోనా కాలానికి సంబంధించిన కాల్పనిక ఘటనలను ఆధారం చేసుకొని క్రియేటివ్ జీనియస్ రమేష్ రాపర్తి ‘థ్యాంక్ యు బ్రదర్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టైటిల్ పోస్టర్ను బట్టి తెలుస్తోంది.
ఈ టైటిల్ పోస్టర్ను హీరో రానా దగ్గుబాటి లాంచ్ చేశారు. ఆ పోస్టర్లో ఓ లిఫ్ట్, దాని ఎదురుగా ఫ్లోర్ మీద పడి ఉన్న మాస్క్ కనిపిస్తున్నాయి. తన ట్విట్టర్ ద్వారా రానా షేర్ చేసిన వీడియోలో యూనిట్ మెంబర్స్ను ఒక్కొక్కరినే మాస్క్ పెట్టుకోమని అడిగి, వారు మాస్క్ పెట్టుకోగానే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పడం కరోనా కాలంలో మాస్క్ ప్రాధాన్యతను చెప్తున్నట్లే కనిపిస్తోంది. టైటిల్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఎలివేటర్ (లిఫ్ట్)కు కథలో కీలక పాత్ర ఉందనే అభిప్రాయాన్ని పోస్టర్ కలిగిస్తోంది.
కాగా, ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. అశ్విన్ విరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మాగుంట శరత్చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరిడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఫస్ట్ లుక్ను విడుదల చేయనున్నారు.
Also Read:
జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!
ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..