ఏపీ ప్రభుత్వం సంచలనం.. మెట్రో రైల్ కార్పొరేషన్ పేరు మార్పు..

| Edited By:

Apr 27, 2020 | 8:43 PM

తాజాగా జగన్ ప్రభుత్వం అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మార్చింది. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ గా ప్రభుత్వం మార్పు చేసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల సౌలభ్యం కోసం పేరు

ఏపీ ప్రభుత్వం సంచలనం.. మెట్రో రైల్ కార్పొరేషన్ పేరు మార్పు..
Follow us on

Amaravati Metro Rail corporation: తాజాగా జగన్ ప్రభుత్వం అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మార్చింది. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ గా ప్రభుత్వం మార్పు చేసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల సౌలభ్యం కోసం పేరు మార్చినట్లు జీవో లో పేర్కొంది. గతంలో నాగపూర్ మెట్రో ప్రాజెక్ట్ పెరు ను మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్ గా మార్పు చేసినట్లు జీవోలో ప్రభుత్వం ఉదహరించింది. లక్నో మెట్రో ప్రాజెక్ట్ పేరును ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్ గా మార్చినట్లు సర్కార్ స్ఫష్టం చేసింది. ప్రస్తుతం విశాఖలో తలపెట్టిన మెట్రో ప్రాజెక్ట్ కు కూడా అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్ట్ గా ఉండటంతో పేరు మార్పు చేసినట్లు జీవో లో ప్రభుత్వం వెల్లడించింది.

Also Read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు..