కరోనా పేషెంట్ల వెంట స్మార్ట్ ఫోన్లు.. కేంద్రం కీలక సూచనలు.!

|

Aug 03, 2020 | 9:52 AM

Allow Corona Patients To Carry Smart Phones: కరోనా రోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు ఇచ్చింది. బాధితులను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించేటప్పుడు వారి వెంట స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లను తెచ్చుకునేందుకు వీలుగా అనుమతులు మంజూరు చేయాలని కేంద్రం కోరింది. కరోనా రోగులు తమ కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడటం ద్వారా ఎంతగానో ఊరటను చెందుతారు. దీని వల్ల వారికి మానసిక సమస్యలు తలెత్తవని తెలిపింది. అయితే కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం.. […]

కరోనా పేషెంట్ల వెంట స్మార్ట్ ఫోన్లు.. కేంద్రం కీలక సూచనలు.!
Follow us on

Allow Corona Patients To Carry Smart Phones: కరోనా రోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు ఇచ్చింది. బాధితులను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించేటప్పుడు వారి వెంట స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లను తెచ్చుకునేందుకు వీలుగా అనుమతులు మంజూరు చేయాలని కేంద్రం కోరింది. కరోనా రోగులు తమ కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడటం ద్వారా ఎంతగానో ఊరటను చెందుతారు.

దీని వల్ల వారికి మానసిక సమస్యలు తలెత్తవని తెలిపింది. అయితే కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం.. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లను క్రిమిరహితం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా కరోనా పేషెంట్లకు పలు కౌన్సిలింగ్ సెషన్లను కూడా ఏర్పాటు చేయాలని పేర్కొంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది.

Also Read:

కొత్త లక్షణం: కరోనా సోకినవారిలో వినికిడి లోపం.!

జగన్ సంచలన నిర్ణయం.. నాలుగు జోన్లుగా ఏపీ విభజన.!