కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. మొబైల్ ఫోన్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, రోగులు ఆసుపత్రుల్లోకి వెళ్లక ముందే తమ మొబైల్ ఫోన్లను బయటే అప్పగించాలని ఆదేశించింది.
కాగా.. ఎవరూ ఆసుపత్రుల లోపలికి ఫోన్లు తీసుకువెళ్లరాదని, విధులు ముగించుకుని వెళ్లే సమయంలో తమ మొబైల్ ఫోన్లను తీసుకెళ్లవచ్చని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా ప్రకటన విడుదల చేశారు.
[svt-event date=”23/04/2020,4:46PM” class=”svt-cd-green” ]
Novel #coronavirus spreads through mobile phones&a decision has been taken, as per WHO guidelines, to control the spread of infection. All doctors, medical staff, & patients must deposit their mobile phones outside and collect it while leaving the hospital: WB Chief Secy (22.04) pic.twitter.com/6hTMptCgPP
— ANI (@ANI) April 23, 2020