AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన అనుపమ..

ఇందులో భాగంగా హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించింది ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించింది అనుపమ. ఈ సందర్భంగా తాను మొక్కలను నాటుతున్న..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన అనుపమ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 21, 2020 | 2:27 PM

Share

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం రోజురోజుకీ మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటడానికి పలువురు ప్రముఖులు ఉత్సాహం చూపుతున్నారు. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది.

ఇందులో భాగంగా హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించింది ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించింది అనుపమ. ఈ సందర్భంగా తాను మొక్కలను నాటుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది.

ఆ పోస్ట్‌లో.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం. ఇందులోకి తనను ఆహ్వానించిన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్‌‌కి థ్యాంక్స్. ఈ మధ్య గత కొన్ని రోజుల క్రితం మా ఇంటి ఆవరణలో 25 మొక్కలు నాటడం జరిగింది. వాటిలో 23 మొక్కలు బావున్నాయి. కానీ రెండు మొక్కలు మాత్రం చనిపోయాయి. అది నాకు చాలా బాధగా అనిపించింది. కానీ ఈ ఛాలెంజ్ ద్వారా చనిపోయిన మొక్కల స్థానంలో మరో మొక్కను నాటడం నాకెంతో సంతోషంగా ఉంది. మా ఇంటి ప్రాంగణంలో ప్లేస్ లేని కారణంగా ఒక మొక్కనే నాటానని పేర్కొంది అనుపమ.

Read More:

ర్యాపిడ్ టెస్టుల కోసం క్యూ కడుతున్న జనం..

కరోనా ట్రీట్‌మెంట్ విషయంపై ఏపీ ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు..