నటుడు, కమేడియన్ సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. కాగా ప్రస్తుతం ఆయనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే సునీల్ అస్వస్థతకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా సునీల్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో నటించారు.