అధికారుల నిర్లక్ష్యంతో.. రోడ్డుపైనే కరోనా బాధితుడి మృతి..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే అధికారులకు
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు బాధితుడు. విషయం తెలిసిన వెంటనే ఆంబులెన్స్ పంపించాల్సిన అధికారులు దీనిని ఏ మాత్రం పట్టించుకోలేదు.
కాగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూనే ఆంబులెన్స్ కోసం ఎదురుచూశాడా బాధితుడు. 4 గంటల పాటు నడిరోడ్డుపైనే మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయాడు. ఆంబులెన్స్ అందకపోవడంతో కరోనా బాధితుడు మరణించాడనే విషయం తెలుసుకున్న అధికారులు దిద్దుబాటు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ సంఘటనపై బృహత్ బెంగళూరు మహానగర పాలికే కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఘటనపై విచారణకు ఆదేశించానని, దీనికి కారణమైనవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పుకొచ్చారు.
[svt-event date=”04/07/2020,1:39AM” class=”svt-cd-green” ]
Karnataka: A COVID-19 patient died on road as ambulance couldn’t reach to him in Hanuman Nagar even 4 hours after he informed Bruhat Bengaluru Mahanagara Palike. BBMP Commissioner Anil Kumar says, “I’ve ordered an inquiry into the incident. Action will be taken against guilty.” pic.twitter.com/YUh3td21pW
— ANI (@ANI) July 3, 2020
[/svt-event]