Breaking : ఫిలిప్పీన్స్లో భూకంపం: 6.4గా తీవ్రత
ఫిలిప్పీన్స్లోని మనీలా సమీపంలో మంగళవారం ఉదయం 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది.
ఫిలిప్పీన్స్లోని మనీలా సమీపంలో మంగళవారం ఉదయం 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్స్లోని మనీలాకు 451 కిలోమీటర్ల ఆగ్నేయ (ఎస్ఇ) భూకంప కేంద్రంగా ఉందని ఏజెన్సీ వివరించించి. ఇండియా కాలమానం ప్రకారం ఉదయం 5:33 సమయంలో భూ ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. ప్రాణ భయంతో ప్రజలంతా ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Also Read :
తగ్గిన బంగారం ధరలు, తాజా రేట్లు ఇలా !
ఏపీ : ఇకపై రాష్ట్ర విపత్తులుగా వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలు