Dharwad Road Accident: కర్ణాటక లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి .. అతివేగమే ప్రమాదానికి కారణమా..!
కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇట్టిగట్టి వద్ద ట్రావెల్స్ వ్యాన్ ను టిప్పర్ వ్యాన్ వెనుక నుంచి ధీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృతి...
Dharwad Road Accident: కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇట్టిగట్టి వద్ద ట్రావెల్స్ వ్యాన్ ను టిప్పర్ వ్యాన్ వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చికిత్స పొందుతూ మరో తొమ్మిది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 17 కు చేరుకుంది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మినీ వ్యాన్ దేవనగర్ నుండి బెళగావి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగమే అని తమ ప్రాధమిక విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.
Read Also: వేల సంవత్సరాల పూర్వమే ఋషులు మరకందించిన సంక్రాంతి ఆచారాలు, వైదిక రహస్యాలు