AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయస్‌ అయ్యర్

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న పంజాబ్‌, ఢిల్లీ జట్లు  పదో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఢిల్లీ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో దూసుకుపోతోంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయస్‌ అయ్యర్
Sanjay Kasula
|

Updated on: Oct 20, 2020 | 7:50 PM

Share

Shreyas Iyer Wins The Toss : దుబాయ్‌ వేదికగా జరుగుతున్న పంజాబ్‌, ఢిల్లీ జట్లు  పదో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఢిల్లీ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో దూసుకుపోతోంది. మరోవైపు పంజాబ్‌ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలే సాధించి ప్లేఆఫ్స్‌కు చేరడం కోసం విశ్వప్రయత్నం చేస్తోంది. గత మ్యాచ్‌లో  ముంబైపై రెండో సూపర్‌ ఓవర్‌లో గెలుపొందిన నేపథ్యంలో ఆ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనబడుతోంది. ఢిల్లీపైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే, వరుస విజయాలతో దూసుకుపోతున్న శ్రేయస్‌ అయ్యర్‌ టీమ్‌పై విజయం సాధించడం పంజాబ్‌కు అంత తేలిక కాదు. ఒకవేళ ఓడితే మాత్రం ప్లేఆఫ్‌ అవకాశాలు సన్నగిల్లుతాయి.

అయితే గాయాల నుంచి కోలుకున్న రిషబ్‌ పంత్‌, హెట్‌మైర్‌, డేనియల్‌ శామ్స్‌ తుది జట్టులోకి వచ్చినట్లు అయ్యర్‌ చెప్పాడు. జోర్డాన్‌ స్థానంలో జేమ్స్‌ నీషమ్‌ను తీసుకున్నట్లు రాహుల్‌ వెల్లడించాడు. సీజన్‌ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై ఢిల్లీ సూపర్‌ ఓవర్‌లో నెగ్గిన విషయం తెలిసిందే. ఇరు జట్ల సభ్యుల వివరాలు…

ఢిల్లీ జట్టు: పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్(కెప్టెన్‌)‌, రిషభ్‌పంత్, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, డేనియల్‌ సామ్స్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, తుషార్‌ దేశ్‌పాండే, కగిసొ రబాడ.

పంజాబ్‌ జట్టు: కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌గేల్‌, నికోలస్‌ పూరన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, దీపక్‌ హూడా, జేమ్స్‌ నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, రవిబిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌