Buried Alive Experience: డబ్బులు తీసుకొని సజీవంగా పాతిపెడుతున్న కంపెనీ.. జపాన్‌లో ఇదో రకం చికిత్స.. ఏం చేస్తారంటే..

భయం, ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తుల కోసం రష్యాలో విభిన్నమైన చికిత్స అందించబడుతోంది. దీని కింద బతికున్న వారికి అంత్యక్రియల అనుభూతిని కల్పించేందుకు బతికుండగానే ఖననం చేస్తున్నారు. ఇందుకోసం వారి నుంచి భారీగా డబ్బులు కూడా తీసుకుంటున్నారు.

Buried Alive Experience: డబ్బులు తీసుకొని సజీవంగా పాతిపెడుతున్న కంపెనీ.. జపాన్‌లో ఇదో రకం చికిత్స.. ఏం చేస్తారంటే..
Creepy Buried Alive

Updated on: Oct 28, 2022 | 9:14 PM

డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. చాలా మంది తమ మనస్సులో ఈ సమస్యను అణిచివేసుకుని పోరాడుతూనే ఉన్నారు. మానసిక వైద్యులు, కౌన్సెలర్ల చుట్టూ తిరుగుతున్నారు. తగ్గించుకునేందుక రకాల చికిత్సలు, మందులను ఉపయోగిస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు అద్భుతమైన మందు మా వద్ద ఉందంటూ ప్రకటించిన రష్యన్ కంపెనీ భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్రకటన కాస్తా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇలా సమస్యలకు పూర్తి స్థాయిలో చెక్ పెడుతామని హామీ ఇస్తోంది. ఈ వివాదాస్పద చికిత్సకు రష్యా భారీగా డిమాండ్ పెరిగింది. ఈ చికిత్సలో బతికుండగానే సమాధి చేస్తారు. అంతే కాదు వారు అందిస్తున్న చికత్సలో చాలా రకాల ప్యాకేజీలు ఉన్నాయి. 

దీని ద్వారా ప్రజలు సజీవంగా ఖననం చేయబడతారు. కొంత సమయం తర్వాత తిరిగి బయటకు తీసుకొస్తారు. వాస్తవానికి, డైలీస్టార్ నివేదిక ప్రకారం, ఇది రష్యాకు చెందిన ఈ కంపెనీ పేరు ప్రీకేటెడ్ అకాడమీ. ఈ సంస్థ విచిత్రమైన చికిత్సను ప్రారంభించింది. ఈ చికిత్సలో ఓ వ్యక్తిని భూమి లోపల సజీవంగా పాతిపెట్టాలి. ఆందోళనతో బాధపడేవారికి ఈ థెరపీ వల్ల ఉపశమనం లభిస్తుందని కంపెనీ పేర్కొంది. సంస్థ దాని గురించి వివరంగా వివరించింది.

అంత్యక్రియల అనుభవం

డైలీ స్టార్ యొక్క నివేదిక ప్రకారం, రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ప్రీకేటెడ్ అకాడమీ అనే సంస్థ ద్వారా ప్రజలు ఒక గంటపాటు సజీవంగా సమాధి చేయబడిన అనుభవాన్ని అందిస్తారు. ఈ సమయంలో అంత్యక్రియల వాతావరణం మొత్తం సిద్ధం చేయబడింది. సంస్థ వ్యవస్థాపకుడు యకాటెరినా ప్రీబ్రాజెన్స్కాయ ప్రకారం, అంత్యక్రియల ప్యాకేజీ తర్వాత ప్రజలు వారి భయం, ఒత్తిడిని అధిగమించడానికి సహాయం చేస్తారు. లైఫ్ కోచ్ ప్రకారం, ఈ అనుభవం తన కోసం పోరాడడాన్ని, సంతోషకరమైన భవిష్యత్తు కోసం పోరాడడాన్ని సూచిస్తుంది.

ఇందులో ప్రాథమికంగా చికిత్స ముఖ్య ఉద్దేశ్యం  తమ అంత్యక్రియల అనుభవాన్ని అందించడం. ఇవేకాకుండా చురుగ్గా సాగుతున్న జనజీవనంలో ప్రజలకు కొంత శాంతిని అందించే ప్రయత్నం కూడా చేశారు. చికిత్స సమయంలో అతను సంగీతం వినడానికి, కొవ్వొత్తులను వెలిగించే అవకాశాన్ని పొందుతాడు. అతను వర్చువల్ వీలునామా రాసే అవకాశాన్ని కూడా పొందుతాడు. 

ఈ థెరపీ పూర్తిగా సురక్షితమైనదని కూడా నిర్వాహకులు తెలిపారు.  ఎటువంటి కారణం లేకుండా మా ఖాతాదారులను ప్రమాదంలో పెట్టం. ప్రస్తుతం దీని ధర రూ. 47 లక్షల  వద్ద ఉంచబడింది. ఇది ఒక గంట పాటే థెరపీ ఉంటుంది.

అందుబాటులో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్యాకేజీలు 

ఇక్కడ ప్రజలు ఆఫ్‌లైన్ అనుభవం కోసం £ 50,000 కంటే ఎక్కువ అంటే భారతీయ కరెన్సీలో రూ. 47 లక్షల ప్యాకేజీని తీసుకుంటున్నారు. అయితే ఈ అనుభవాన్ని ఆన్‌లైన్‌లో తీసుకుంటే దాని ధర £ 13,000 అంటే రూ. 12 కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. లక్ష ఉంది. ఇందులోనే అంత్యక్రియలు పూర్తి చేస్తారు, అది చూసి మనిషిలో జీవించాలనే కోరిక పుడుతుంది. సంస్థ వ్యవస్థాపకుడు దాని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చెప్పారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం