రైల్వే ప్రయాణికులు అలర్ట్.. ఇకనుంచి రైళ్లలో మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ కుదరదు..! ఎందుకో తెలుసా..?

Mobile Laptop Charging in Train : భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రత కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. రాత్రి సమయంలో ప్రయాణికులు తమ మొబైల్, ల్యాప్‌టాప్‌లను

రైల్వే ప్రయాణికులు అలర్ట్..  ఇకనుంచి రైళ్లలో మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ కుదరదు..!  ఎందుకో తెలుసా..?
Mobile Laptop Charging In T
Follow us

|

Updated on: Mar 30, 2021 | 8:07 PM

Mobile Laptop Charging in Train : భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రత కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. రాత్రి సమయంలో ప్రయాణికులు తమ మొబైల్, ల్యాప్‌టాప్‌లను ఛార్జింగ్ చేసుకోవడానికి కుదరకపోవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఉపయోగించే స్విచ్ బోర్డ్‌లు రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఆపి వేయబడుతాయని రైల్వే సీనియర్ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇటీవలే డెహ్రాడూన్‌కు చెందిన శతాబ్దిఎక్స్‌ప్రెస్‌లో మార్చి 13 న షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. అంతేకాకుండా రాంచీ స్టేషన్‌లోని స్టాటిక్ గూడ్స్ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి వివరించారు. భద్రతా చర్యల పై రైల్వే అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. రైళ్ల పరుగులో అన్ని భద్రతా చర్యలను క్షుణ్ణంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని రైల్వే మంత్రి పీయూష్ చావ్ల ఒక ప్రకటనలో తెలిపారు. రైళ్లలో అగ్ని ప్రమాదాలను తగ్గించడానికి ఇటీవల రైల్వే ధూమాపానంపై అనేక కార్యక్రమాలను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ కారణం వల్లే ఆన్‌బోర్డ్ రైళ్ళలో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి, తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి రైల్వే ఉన్నత అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతేకాకుండా వినియోగదారులు, సిబ్బందికి అవగాహన కల్పించడానికి ఏడు రోజుల ఇంటెన్సివ్ అవేర్‌నెస్ డ్రైవ్‌ను నిర్వహించాలని ఆదేశించారు.

మరిన్ని చదవండి : Electric Bikes: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కారు బంపరాఫర్‌.. లక్షకుపైగా ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ కొనుగోలు..

Covid Warning: కరోనా సెకెండ్ వేవ్ మరింత తీవ్రం.. రాష్ట్రాలకు కేంద్రం తాజా హెచ్చరికలు

These Cars Prices Raising: కారు కొనేందుకు ప్లాన్‌ చేస్తున్నారా.? అయితే రేపే కొనేయండి.. ఎందుకంటే ఈ కార్ల ధరలు..

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే