Independence Day: సమరయోధులకు వినూత్న రీతిలో రక్తంతో చిత్రనివాళి అర్పించిన చిత్రకారుడు కోటేష్

| Edited By: Balaraju Goud

Aug 15, 2024 | 1:57 PM

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోటేష్ అనే చిత్రకారుడు రాసిన, వేసిన చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. దేశభక్తిని చాటుతున్న ఈ చిత్రాలు అమరుల త్యాగాలను గుర్తు చేస్తున్నాయి.

Independence Day: సమరయోధులకు వినూత్న రీతిలో రక్తంతో చిత్రనివాళి అర్పించిన చిత్రకారుడు కోటేష్
Painting
Follow us on

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోటేష్ అనే చిత్రకారుడు రాసిన, వేసిన చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. దేశభక్తిని చాటుతున్న ఈ చిత్రాలు అమరుల త్యాగాలను గుర్తు చేస్తున్నాయి.

నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని వినూత్నమైన రీతిలో స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను చిత్రీకరించి దేశ భక్తిని చాటారు. 240 మంది సమర యోధుల చిత్రాలను తన రక్తం
A 3 డ్రాయింగ్ షీట్ పై 5 గంటల పాటు శ్రమించి ఎంతో అద్బతంగా చిత్రీకరించి ప్రశంసలు పొందారు. ఎందరో వీరుల త్యాగ ఫలమే నేటి స్వాంతంత్య్ర ఫలం అని చిత్రకారుడు కోటేష్ కొనియాడారు.

ఈ చిత్రంలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన యోధులను, పోరాట యోధులను భరతమాత చూస్తున్నట్లు అందరిని అలోచింపచేసేలా చిత్రాన్ని గీశాడు చిత్రకారుడు కోటేష్. అంతే కాకుండా ఈ చిత్రంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, ఆల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, సుబాష్ చంద్రబోష్ చిత్రాలతో పాటు జలియన్‌వాలాబాగ్ సంఘటన లో నిరాయుధులైన స్త్రీలపై, పురుషులపై, పిల్లలపై విచక్షణ రహితంగా బ్రిటిష్ వారు జరిపిన కాల్పుల ఘటన కళ్ళకు కట్టినట్లు చూపించారు. చిత్రకారుడు కోటేష్ ఒకే డ్రాయింగ్ షీట్ పై ఎంతో అద్బతంగా గీశారు.

దేశం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి అమరులైన వీరులు, వీరమాతలు ఎందరో వున్నారని, లాఠీ దెబ్బలు, ఎన్నో అవమానాలు, కఠిన కారాగార శిక్షలు అనుభవించారని గుర్తు చేశారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో వచ్చి స్వాతంత్ర్య దినోత్సవం రోజున తన రక్తంతో సమరయోధులకు చిత్రనివాళి అర్పించడం అనందగా ఉందన్నారు కోటేష్.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..