ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రకరకాల వ్యాధులు విజృంభిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు.. కోవిడ్ రకరకాల వేరియంట్స్ తో ఓ వైపు భయపెడుతుంటే.. మన దేశంలో బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు మరో వైపు పెరుగుతున్నాయి. ఇంతలో నేనున్నానంటూ వెస్ట్ నైల్ వైరస్ కొత్త ముప్పుని మానవాళికి తీసుకొచ్చింది. ఇజ్రాయెల్లో ఈ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వైరస్ కారణంగా గత కొద్ది రోజుల్లోనే 15 మంది రోగులు మరణింనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ వెస్ట్ నైల్ కొత్త వైరస్ కాదు.. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వైరస్ కేసులు పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ లో వ్యాపిస్తున్న ఈ వ్యాధి క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ రోజు వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? దీనిని ఎలా నిరోధించవచ్చు? దీని గురించి నిపుణుల సలహా సూచనలు ఏమిటో తెలుసుకుందాం..
ఇజ్రాయెల్లోని అనేక నగరాల్లో వెస్ట్ నైలు జ్వరం వ్యాపిస్తోంది. మే నుంచి ఈ వైరస్ సోకిన రోగుల సంఖ్య 300 కి చేరుకుంది. 15 మంది రోగులు మృతి చెందగా, 20 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది. ఇజ్రాయెల్లో పెరుగుతున్న ఈ వైరస్ కేసుల దృష్ట్యా, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.
యశోద హాస్పిటల్ కౌశాంబి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఛవీ గుప్తా మాట్లాడుతూ.. వెస్ట్ నైల్ వైరస్ పక్షుల్లో కనిపిస్తుందన్నారు. ఈ వైరస్ సోకిన జంతువును దోమ కుట్టినప్పుడు, ఈ వైరస్ దోమ లోకి వెళ్తుంది. ఆ దోమలు మనుషులను కుట్టినప్పుడు వెస్ట్ నైల్ వైరస్ మనుషులకు సోకుతుంది. అటువంటి లక్షణాలు ఈ వైరస్ సంక్రమణ తర్వాత కనిపిస్తాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ వైరస్ కేసులు ప్రతి సంవత్సరం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి ఇజ్రాయెల్లో ఈ వైరస్ కేసులు అధికంగా వస్తున్నాయి. అంతేకాదు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రక్షణ అవసరం. ఈ జ్వరం లక్షణాలు, నివారణ మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డాక్టర్ గుప్తా సూచించారు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.