AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pani Puri: తోపుడు బండ్లపై పానీ పూరీ తింటున్నారా? అయితే ఈ వార్నింగ్ మీకే..

వర్షాల సీజన్‌లో తోపుడు బండ్లపై పానీ పూరీ తినొద్దని తెలంగాణ వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. పానీ పూరీ బండ్ల దగ్గర నుంచే టైఫాయిడ్‌ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.

Pani Puri: తోపుడు బండ్లపై పానీ పూరీ తింటున్నారా? అయితే ఈ వార్నింగ్ మీకే..
Panipuri
Janardhan Veluru
|

Updated on: Jul 12, 2022 | 2:50 PM

Share

పానీ పూరీ ప్రియులకు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు వార్నింగ్‌ ఇచ్చారు. వర్షాల సీజన్‌లో తోపుడు బండ్లపై పానీ పూరీ తినొద్దని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో తోపుడు బండ్లపై విక్రయించే పానీ పూరీ తింటే రోగాల బారినపడే ముప్పు ఉందని హెచ్చరించారు. పానీ పూరీ బండ్ల దగ్గర నుంచే టైఫాయిడ్‌ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. టైపాయిడ్‌ పానీపూరీ డిసీజ్‌గా మారిందన్నారు. పానీ పూరీ తోపుడు బండ్ల వారు కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. మరోవైపు వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు డీహెచ్‌. వరుసగా మూడు నాలుగు రోజులు జ్వరం వస్తే డాక్టర్‌కు చూపించుకోవాలన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఆహారం, నీరు కలుషితం కాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు  సూచించారు. ఆహారం, నీరు కలుషితమైతే విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు అత్యంత అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.

కోవిడ్ నుంచి పూర్తిగా బయటపడ్డా.. ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలని అన్నారు. కరోనాతో ఇక భయపడాల్సిన అవసరంలేదని.. అయితే మాస్క్‌ మాత్రం కచ్చితంగా పెట్టుకోవాలని సూచించారు. మాస్క్ పెట్టుకుంటే బ్యాక్టీరియా, వైరస్ కారక సీజనల్ వ్యాధులు, విష జ్వరాల బారి నుంచి తప్పించుకోవచ్చని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ కథనాలు చదవండి..