AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: ఈ పదార్థాలు తినగానే అలర్జీలు అవుతున్నాయా..? జాగ్రత్త..

Food Allergy: ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే అలర్జీలు వస్తుంటాయి. ప్రకృతిలో దొరికే ప్రతి ఆహారం..

Health Care: ఈ పదార్థాలు తినగానే అలర్జీలు అవుతున్నాయా..? జాగ్రత్త..
Subhash Goud
|

Updated on: May 16, 2022 | 12:04 PM

Share

Food Allergy: ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే అలర్జీలు వస్తుంటాయి. ప్రకృతిలో దొరికే ప్రతి ఆహారం ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. అయితే ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం. అందులోనూ కొందరికి కొన్ని ఆహార పదార్థాలు పడవు. వాటి వల్ల రకరకాల అలర్జీలకు గురవుతారు. అలాంటివారు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.

  1. గోధుమలు: బలవర్ధకమైన ఆహారం. కానీ వీటిలోని గ్లూటెన్‌ కారణంగా కొందరిలో అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్లూటెన్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అధిక బరువు, జీర్ణ సమస్యలు వస్తుంటాయని చెబుతున్నారు.
  2. సీఫుడ్‌: చేపలు, రొయ్యలు, నత్తల వంటి సముద్రపు ఆహారం శరీరానికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అయితే వీటిలోని కొన్ని పదార్థాలు కొందరికి పడవు. అలర్జీలు కలిగిస్తాయి. అలాంటి వారు వీటికి దూరంగా ఉండటం మంచిది.
  3. సోయా: ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. శాకాహారుల మాంసంగా కూడా పేరుంది. అయితే దీనిలోనూ చర్మ సంబంధ సమస్యలు కలిగించే రసాయనాలు ఉన్నాయంటారు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
  4. నట్స్‌: బాదం, కాజు, పైన్‌ నట్స్‌, వాల్‌నట్స్‌.. వంటివి తినడం వల్ల కొందరికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పీనట్‌ బటర్‌, చీజ్‌ కూడా వీరికి పడకపోవచ్చు. అలాంటి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది.
  5. గుడ్లు: శరీరానికి కావలసిన అన్ని పోషకాలనూ అందిస్తాయి. అయితే, గుడ్లు కొందరికి అలర్జీ కలిగిస్తాయి. ఫుడ్‌ ఎలర్జీలకు కారణమయ్యే ఆహార పదార్థాల్లో రెండో స్థానం గుడ్లదే. గుడ్లలో ఎన్నో పోషకాలు ఉన్నా.. కొందరికి అలర్జీ కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కొన్ని ఆహారాలు తిన్న తర్వాత అలర్జీ వస్తుంటుంది. కొందరు కొన్ని ఆహారాలు పచ్చిగా తిన్నా.. వండిన తర్వాత తిన్నా అలర్జీ వస్తుంటుంది. కొందరు వ్యక్తులు పచ్చి లేదా వండని పండ్లు, కూరగాయలను తిన్న తర్వాత నోరు, గొంతు దురద వస్తుంటుంది. అయితే ఆహారాన్ని వేడి చేయడం ద్వారా అలెర్జీ కారకం నాశనమవుతుంది. తర్వాత ఎటువంటి సమస్య లేకుండా తినవచ్చు. కొన్ని కొన్ని సార్లు ఎక్కువ కాలం పాటు ఏమైనా ఆహార పదార్థాలు తీసుకోకుండా ఒకేసారి తినడం వల్ల కూడా ఎలర్జీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల కూడా ఎలర్జీ వస్తుంది. కొంత మందిలో అయితే స్పెసిఫిక్ గా ఈ అలర్జీ ఉంటుంది ఉదాహరణకు పచ్చి పల్లీలు తిన్నప్పుడు ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సాల్ట్ వేసుకుని తినడం వల్ల ఎలర్జీ రాకపోవచ్చు. ఇలా కొందరిలో స్పెసిఫిక్ ఎలర్జీలు ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ