వేసవిలో డీలా పడకుండా ఉండాలంటే ఈ డ్రింక్ తప్పకుండా తీసుకోవాల్సిందే
వేసవి వేడిని తట్టుకోవడానికి సహజమైన చల్లదనాన్ని అందించే ఆహారాలు తీసుకోవడం అవసరం. అలాంటి వాటిలో కీరదోసకాయ రసం చాలా ఉపయోగకరమైనది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా జీర్ణం, నిద్ర, ఒత్తిడి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇది ఉపయోగపడుతుంది.

వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచే పండ్లు, కూరగాయలూ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో కీరదోసకాయ రసం ముఖ్యమైనది. ఈ రసం తాగడం వల్ల శరీరానికి మంచిగా చలువ కలుగుతుంది. వేడి కారణంగా కలిగే అనేక సమస్యలకు ఇది ఉపశమనం ఇస్తుంది.
కీరదోసకాయ రసం తీసుకుంటే మన మెదడు చురుకుగా పని చేస్తుంది. మనసు ఏకాగ్రతగా మారుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. చదువు నేర్చుకునే విద్యార్థులు దీనిని తాగితే మంచి ఫలితం పొందగలరు. మొబైల్, టీవీ, పని ఒత్తిడి వల్ల ఆలోచనలు తారుమారవుతున్న ఈ రోజుల్లో ఇది సహాయపడుతుంది.
ఈ రసం మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎప్పుడూ టెన్షన్తో ఉండే వ్యక్తులు కీరదోసకాయ రసం తాగితే మానసిక ప్రశాంతత పొందగలరు. ఇది శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. నిద్ర కూడా బాగా వస్తుంది. రోజూ ఉదయాన్నే తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
కీరదోసకాయ రసంలో ఉండే పీచు, నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. భోజనం తిన్న తర్వాత అజీర్ణం, కడుపు నొప్పి, కాన్ట్సిపేషన్ వంటి సమస్యలుంటే దీనిని తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. చిన్నపిల్లలకూ పెద్దలకూ కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఈ రసం ఎముకల ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉన్న ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచుతాయి. వయస్సు పెరిగేకొద్దీ ఎముకలు బలహీనమవుతుంటే కీరదోసకాయ రసం సహాయపడుతుంది. ఇది ప్రత్యేకంగా మహిళలకు ఉపయోగపడుతుంది.
ఈ రసం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది మంచిది. రక్త ప్రవాహాన్ని సరిచేస్తుంది. గుండెకు మేలు కలిగించే పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇది గుండె సంబందిత రుగ్మతల నివారణకు తోడ్పడుతుంది.
కీరదోసకాయ రసం కండరాలకు బలం ఇస్తుంది. వ్యాయామం చేసే వారు దీన్ని తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. శారీరక శ్రమ పెరిగినప్పుడు ఈ రసం తాగితే అలసట తగ్గుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)