ఈ రోజుల్లో డయాబెటిస్ వారు పెరిగిపోతున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందిని డయాబెటిస్ వెంటాడుతోంది. మధుమేహం అనేది నేడు ప్రతి రెండవ మూడవ వ్యక్తిని ప్రభావితం చేసే వ్యాధి. దీనికి ప్రధాన కారణాలలో ఆహారం, జీవనశైలి. డయాబెటిస్ ఇప్పుడు పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారిని వేదిస్తోంది. మధుమేహంలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక రకమైన జన్యుపరమైన రుగ్మత, ఇది ఒక తరం నుండి మరొక తరానికి వ్యాపిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ మీ జీవనశైలి, చెడు అలవాట్ల కారణంగా వస్తుంది. ఒకసారి మధుమేహం వచ్చిదంటే దానిని పూర్తిగా నిర్మూలించలేని పరిస్థితి. జీవనశైలి మార్పులు చేసుకోవడం, ఆహార అలవాట్లను మార్చుకోవడం తప్ప వేరే మార్గం లేదనే చెప్పాలి.
అయితే నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకొంటాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం మధుమేహం కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోగులు మరణిస్తున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం చాలా అవసరం. ఈ వ్యాధి గురించిన ప్రజల్లో అవగాహన పెంచేందుకు మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధిని నివారించడానికి జీవనశైలిలో మార్పులు, మంచి ఆహారం, శారీరక శ్రమ చాలా ముఖ్యం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుతో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య 1991లో ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించగా, 2006 నుండి అధికారికంగా పాటిస్తున్నారు.మధుమేహంతో బాధపడుతున్నవారు కొన్నింటిని తీసుకోవడం వల్ల అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి