బన్నీ-ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్‌.. కథాంశం కూడా చెప్పేసిన డైరెక్టర్..!

| Edited By:

Apr 30, 2020 | 9:16 PM

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌లకు మంచి క్రేజ్‌ ఉంది. ప్రేక్షకుల నుంచి మల్టీస్టారర్‌ చిత్రాలకు మంచి ఆదరణ లభించడంతో.. వీటిపై టాప్ హీరోలు సైతం ఆసక్తిని చూపుతున్నారు.

బన్నీ-ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్‌.. కథాంశం కూడా చెప్పేసిన డైరెక్టర్..!
Follow us on

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌లకు మంచి క్రేజ్‌ ఉంది. ప్రేక్షకుల నుంచి మల్టీస్టారర్‌ చిత్రాలకు మంచి ఆదరణ లభించడంతో.. వీటిపై టాప్ హీరోలు సైతం ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ-ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్ తీయాలనుందని తన కోరికు బయటపెట్టారు యంగ్ డైరక్టర్.

‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన స్వరూప్ ఆర్జేఎస్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ల గురించి చెప్పుకొచ్చారు. ”మల్టీస్టారర్ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. బన్నీ-ఎన్టీఆర్‌లతో జాన్ విక్‌ స్టైల్‌ లాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాలనుకుంటున్నా. పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కించాలన్నది నా డ్రీమ్‌. అలాగే ఆమిర్ ఖాన్- ప్రభాస్‌తో ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్‌ను తెరకెక్కించాలనుకుంటున్నా. వీటితో పాటు నా ఆల్‌టైమ్ ఫేవరెట్‌ మెగాస్టార్‌ చిరంజీవిని డైరక్ట్ చేయాలనుకుంటున్నా” అని తన కోరికలను బయటపెట్టారు.

బన్నీ-ఎన్టీఆర్, ఆమిర్-ప్రభాస్.. ఈ కాంబినేషన్‌లలో మల్టీస్టారర్‌లు చేస్తే వాటికి కచ్చితంగా మంచి క్రేజ్ వస్తుంది. కానీ మల్టీస్టారర్‌ తీయాలంటే ఇద్దరికీ స్టోరీ నచ్చాలి. ఇద్దరి డేట్స్ కుదరాలి. ఇద్దరు స్టార్‌లతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దర్శకుడి కోరిక భవిష్యత్‌లో నెరవేరుతుందేమో చూడాలి. కాగా ప్రస్తుతం ఈ దర్శకుడు నవీన్‌తో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు. డిటెక్టివ్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించనున్నానని.. మరో రెండు నెలల్లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు చెబుతానని ఆయన అన్నారు.

Read This Story Also: చిరుకు మరో షాక్.. ‘ఆచార్య’ నుంచి తప్పుకున్న కాజల్..?