విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు. ఇటీవల ‘రాజ రాజా చోర’ చిత్రంతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోరును ఇలాగే కొనసాగిస్తూ త్వరలో ‘ అర్జున ఫల్గుణ’ సినిమాతో మళ్లీ మన ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. కాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
కాగా ఈ సినిమాలో అమృతా అయ్యర్ శ్రీవిష్ణుతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోనుంది. ఆమె ‘రెడ్’, ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుంది. ఆమెతో పాటు నరేశ్, సుబ్బరాజు, మహేశ్, శివాజీ రాజా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో తేజ మార్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నిరంజన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా ప్రియదర్శన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ‘అర్జున ఫల్గుణ’తో పాటు ‘భళా తందనాన’ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు శ్రీ విష్ణు.
Water Supply Scheme: భాగ్యనగరవాసులకు అలెర్ట్.. ఉచిత నీటి పథకానికి నమోదు చేసుకోని వారికి బిల్లులు..
Telangana: రేపు కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ సంయుక్త సమావేశం.. చర్చకు రానున్న అంశాలివేనా?
East Godavari: ఇంజినీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కలకలం.. రూ. 5లక్షలు డిమాండ్ చేస్తున్న దుండగులు..