Tollywood: టాలీవుడ్ను ముక్కలుచేస్తున్న పర్సంటేజీలు.. సింగిల్ స్క్రీన్లు! ఆ నలుగురిలో లేనంటూ..
'ఎవరో జ్వాలను రగిలించారు.. మరెవరో దానికి బలి అయ్యారు' అనే పాట గుర్తొస్తోంది ఈ సందర్భంలో. పక్కన కూర్చున్నవాళ్లు ఏదో మాట్లాడితే... ఆ ప్రభావం మరొకరిపై పడింది. మాట్లాడింది ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ అయితే.. ఆ ప్రభావం పడింది ఛాంబర్ ప్రెసిడెంట్ అయిన సునీల్ నారంగ్పై...

‘ఎవరో జ్వాలను రగిలించారు.. మరెవరో దానికి బలి అయ్యారు’ అనే పాట గుర్తొస్తోంది ఈ సందర్భంలో. పక్కన కూర్చున్నవాళ్లు ఏదో మాట్లాడితే… ఆ ప్రభావం మరొకరిపై పడింది. మాట్లాడింది ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ అయితే.. ఆ ప్రభావం పడింది ఛాంబర్ ప్రెసిడెంట్ అయిన సునీల్ నారంగ్పై. ఏకంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. అది కూడా అధ్యక్షుడిగా ఎన్నికై ఒక రోజు కూడా గడవక ముందే. ఈ గ్యాప్లో ఏం జరిగి ఉంటుందా అని తలలు బద్దలుకొట్టుకుంటున్నారంతా. అయితే.. ఓ ఇద్దరు ముగ్గురు నిర్మాతలు.. చిన్నవాళ్లు కాదు అగ్రనిర్మాతలే.. నారంగ్ను బ్లేమ్ చేసేలా మాట్లాడారని ఓ టాక్. రిజైన్ వెనక రీజన్ అదేనంటున్నారు. ఇంతకీ.. ఈ వివాదం వెనక చెప్పుకోవాల్సిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి సునీల్ నారంగ్.. వరుసగా మూడోసారి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి రెండేళ్లకోసారి ఎలక్షన్స్ జరగడం కామన్. దాదాపుగా ఆ ఎన్నికలు ఏకగ్రీవం అవుతుంటాయి. ఈసారి కూడా ఏకగ్రీవం అయింది. సునీల్ నారంగ్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ అయ్యారు. సో, కొత్త కమిటీని అందరికీ పరిచయం చేయడానికి ఓ ప్రెస్మీట్ పెట్టారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. రచ్చంతా జరిగింది ఆ ప్రెస్మీట్లోనే కాబట్టి. శ్రీధర్.. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ఇతను. ఇదీ తమ కొత్త టీమ్ అని చెప్పి వెళ్లిపోవాల్సిన వ్యక్తి… కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....