Actress Bhagyashree: టాలీవుడ్‌లోకి భాగ్యశ్రీ గారాలపట్టి.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌.. హీరో ఎవరో తెలుసా?

|

Oct 12, 2022 | 3:55 PM

పెళ్లి చేసుకుని ఇంటికే పరిమితమైన  భాగ్యశ్రీ చాలా ఏళ్ల తర్వాత రాధేశ్యామ్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. అంతకుముందు కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన తలైవీలోనూ మెరిసింది.

Actress Bhagyashree: టాలీవుడ్‌లోకి భాగ్యశ్రీ గారాలపట్టి.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌.. హీరో ఎవరో తెలుసా?
Actress Bhagyashree
Follow us on

మైనే ప్యార్‌ కియా సినిమాతో బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసింది భాగ్యశ్రీ. తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. సినిమాలో ఆమె అందం, అభినయానికి అందరూ ముగ్ధులైపోయారు. అయితే వన్‌ ఫిల్మ్‌ వండర్‌లా ఆమె కేవలం ఒక్క సినిమాకే పరిమితమైంది. ఆతర్వాత బాలకృష్ణ నటించిన యువరత్న రాణాతో పాటు కొన్ని కన్నడ, తమిళ్‌, బెంగాలీ సినిమాల్లో నటించినా అవన్నీ పూర్తి స్థాయి పాత్రలు కాదు. పెళ్లి చేసుకుని ఇంటికే పరిమితమైన  భాగ్యశ్రీ చాలా ఏళ్ల తర్వాత రాధేశ్యామ్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. అంతకుముందు కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన తలైవీలోనూ మెరిసింది. ఇదిలా ఉంటే భాగ్యశ్రీ కుమారుడు, కూతురు కూడా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఇప్పటికే కుమారుడు అభిమన్యు దుస్సాని బాలీవుడ్‌లో నటుడిగా పరిచయమ్యాడు. కుమార్తె అవంతిక దుస్సానీ కూడా మిత్యా వెబ్‌సిరీస్‌తో వెండితెరకు పరిచయమైంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోకి కూడా ఎంటర్‌ అవుతోంది.

కాలేజీ స్టూడెంట్‌గా..

ఇటీవల స్వాతిముత్యంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ గణేశ్‌. అతని తర్వాతి చిత్రం నేను స్టూడెంట్ సార్‌. ప్రముఖ దర్శకులు తేజ శిష్యుడైన రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్‌గా అవంతిక ఎంపికైంది. ఇందులో ఆమె శృతి వాసుదేవన్‌ అనే కాలేజీ స్టూడెంట్‌ పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఆమెకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్‌ చేశారు మూవీ మేకర్స్‌. ఎంతో స్టైలిష్‌ అండ్‌ క్యూట్‌గా ఉన్న ఈ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.

ఇవి కూడా చదవండి

కాగా ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కృష్ణ చైతన్య కథ అందిస్తున్నారు. సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్‌ బాణీలు సమకూరుస్తున్నారు. నిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జ‌రుపుకుంటోంది. త్వరలోనే విడుద‌ల తేదీని ప్రకటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..