AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eagle Trailer : దుమ్మురేపిన మాస్ రాజా.. “ఈగల్” ట్రైలర్ మాములుగా లేదు గురూ

ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈగల్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇప్పటికే ఈగల్ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Eagle Trailer : దుమ్మురేపిన మాస్ రాజా.. ఈగల్ ట్రైలర్ మాములుగా లేదు గురూ
Eagle Trailer
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2023 | 5:09 PM

Share

మాస్ మహారాజారా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈగల్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇప్పటికే ఈగల్ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఈగల్ సినిమా లో రవితేజ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. రవితేజ లుక్స్, డైలాగ్స్, మాస్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు దర్శకుడు. ఇక ఈ సినిమా ట్రైలర్ కొద్దిక్షణాల క్రితమే రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ట్రైలర్ లోనూ ఏవ్ హైలైట్ గా నిలిచాయి.

విజువల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా.. అంటూ నవదీప్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైరల్ ప్రారంభం అయ్యింది. విషం మిగినుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఆపుతాను..కాపలా అవుతాను అంటూ రవితేజ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.  విధ్వంసం నేను.. విధ్వంసాన్నిఆపే వినాశనం నేను అనే డైలాగ్ హైలైట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాను జనవరి 13న పేక్షకుల ముందుకు రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.