Rashmika Mandanna: సల్మాన్ కోసం రష్మిక త్యాగం.. ఏకంగా అన్ని రోజులు ముంబైలోనే ఉండనుందా?

|

Aug 27, 2024 | 7:41 PM

బాలీవుడ్‌ స్టార్ నటుడు సల్మాన్‌ఖాన్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'సిఖందర్‌'. సౌతిండియన్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అంబానీ ఇంటి పెళ్లి, ఇతర కార్యక్రమాల కారణంగా ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా సినిమా పనుల్లో నిమగ్నమైపోవాలని సల్లూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Rashmika Mandanna: సల్మాన్ కోసం రష్మిక త్యాగం.. ఏకంగా అన్ని రోజులు ముంబైలోనే ఉండనుందా?
Salman Khan, Rashmika Mandanna
Follow us on

బాలీవుడ్‌ స్టార్ నటుడు సల్మాన్‌ఖాన్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘సిఖందర్‌’. సౌతిండియన్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అంబానీ ఇంటి పెళ్లి, ఇతర కార్యక్రమాల కారణంగా ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా సినిమా పనుల్లో నిమగ్నమైపోవాలని సల్లూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా షూటింగ్ కంప్లీట్ చేస్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఉపయోగపడుతుందని అతని ఆలోచన. అందుకే ఏకంగా ఒకటిన్నర నెలల పాటు షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. 2025 ఈద్ సందర్భంగా ‘సిఖందర్’ సినిమా విడుదల కానుంది. ఇది భారీ బడ్జెట్ సినిమా. అలాగే ఈ సినిమాని వివిధ లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. ఇన్ని కారణాల వల్ల వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉంది. అందుకే ముంబైలో 45 రోజుల షెడ్యూల్‌ని పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటారు.

సల్మాన్ ఖాన్ సినిమాల్లో అద్భుతమైన యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు షూట్ చేయనున్న షెడ్యూల్‌లో కూడా అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉంటాయట. ప్రస్తుతం స్టూడియో వన్‌లో ఈ మూవీ షూటింగ్ జరగనుంది. సెట్ నిర్మాణానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కూడా నటిస్తున్నారు. దీంతో వారు కూడా ఇక్కడే ఉంటారు. అలాగే రష్మిక కూడా కొన్ని రోజులు ముంబైలోనే ఉండనుంది. కాగా తన సినిమా పనుల కోసం తరచూ చెన్నై, హైదరాబాద్‌, ముంబై నగరాలను చుట్టేస్తోంది రష్మిక.

ఇవి కూడా చదవండి

తన చిట్టి చెల్లెలితో రష్మిక..

సల్మాన్‌ ఖాన్‌కి ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలు లేవు. అందుకే తమిళ దర్శకుడు మురుగదాస్ తో చేతులు కలిపాడు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. 2025కి ఈ సినిమాను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ ఏడాది సల్లూ సినిమా విడుదల కాలేదు. ఇది ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ఇతర సినిమాల విషయానికి వస్తే రష్మిక మందన్నా ‘పుష్ప 2’ పనుల్లో నూ నిమగ్నమై ఉంది.

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.