ఎవర్గ్రీన్ బ్యూటీ, ఇండస్ట్రీని ఏలిన నటి.. రమ్యకృష్ణ గురించి మీకు ఈవిషయాలు తెలుసా..?
సినిమా రంగాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు రమ్యకృష్ణ. భారతీయ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో రమ్యకృష్ణ ఒకరు. సినీ పరిశ్రమలో గత 30 ఏళ్లుగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు ఈ ముద్దుగుమ్మ. తమిళంలో, నటుడు రజనీకాంత్ బడయప్ప( నరసింహ)లో నీలాంబరి పాత్రను పోషించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

రమ్యకృష్ణ.. ఎవర్గ్రీన్, బ్యూటీఫుల్, సూపర్ క్యూట్.. ఇలా ఎన్ని పదాలు వాడినా.. ఆమె గురించి తక్కువ చెప్పినట్లే అవుతోంది. కేవలం అందం మాత్రమే కాదు నటన విషయంలో కూడా ఆమెకు ఆమే సాటి. సోమవారం(సెప్టెంబరు 15) రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం. కృష్ణన్, మాయ దంపతులకు 1970, సెప్టెంబర్ 15న రమ్యకృష్ణ జన్మించారు. ప్రముఖ తమిళ కమెడియన్, క్యారెక్టర్ నటుడు, జర్నలిస్ట్ చొ రామస్వామికి రమ్యకృష్ణ మేనకోడలు. భరతనాట్యం, వెస్ట్రన్, కూచిపూడి నృత్యాల్లో ఆమె ట్రైనింగ్ తీసుకున్నారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు సైతం ఇచ్చారు.
ఇండస్ట్రీ వల్గర్గా తయారైంది.. ఓపెన్గా కమిట్మెంట్ అడుగుతున్నారు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
రమ్యకృష్ణ పద్నాలుగు సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘వెళ్ళై మనసు’ అనే చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సౌత్లో అందరు అగ్ర హీరోల సరసన ఆమె ఆడిపాడారు. ఏ పాత్ర వేసినా 100 శాతం న్యాయం చేయడం ఆమె ప్రత్యేకత. ‘భలే మిత్రులు’ అనే సినిమాతో రమ్యకృష్ణ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూత్రధారులు’ అనే సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమాలతో ఆమె స్టార్ తిరిగిపోయింది.’
ఇద్దరు స్టార్ హీరోలు.. పెద్ద హీరోయిన్.. రూ.200కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే భారీ డిజాస్టర్
తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, రాజశేఖర్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్లతో కలిసి నటించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహమాడారు రమ్యకృష్ణ. వీరి వివాహం 2003లో జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’లో ఎంతో ప్రాముఖ్యం ఉన్న ‘శివగామి’ పాత్రతో మరోసారి తన నటనా స్థాయిని ప్రపంచానికి చూపించారు. ‘బాహుబలి: ద బిగినింగ్’ సినిమాకుగానూ ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డు, ఐఫా అవార్డు దక్కించుకున్నారు. ‘బాహుబలి: ద కంక్లూజన్’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు రమ్యకృష్ణ. కాగా రమ్యకృష్ణకు ఇంత క్రేజ్ తెచ్చిన బాహుబలి సినిమాకు ముందుగా శివగామి రోల్ కోసం ముందుగా శ్రీదేవి సంప్రదించారట రాజమౌళి. శ్రీదేవి ఆ పాత్ర చేస్తే సినిమాకు మరింత వెయిట్ వస్తుందని భావించాడట జక్కన్న. అయితే బాహుబలి సినిమా కోసం శ్రీదేవి రూ.8 కోట్లు డిమాండ్ చేసిందట. అలాగే సినిమాలో షేర్ కూడా అడిగిందట. వీటితోపాటు ఆమె హోటల్ బిల్లులు, ఫైట్ ఛార్జ్ లు అన్ని కలుపుకొని దాదాపు రూ. 15కోట్ల వరకు అవుతున్నాయట. దాంతో ఆమె ప్లేస్ లో రమ్యకృష్ణను తీసుకున్నారట. ఈ వార్తలను శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఖండించారు.
బాబోయ్.. బీభత్సం..! రవితేజ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! ఈ దెబ్బతో హీరోయిన్స్ అవుట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




