Ram charan: యంగ్‌ ట్యాలెంట్‌ను ప్రోత్సహించేందుకు రామ్‌ చరణ్‌ కీలక నిర్ణయం.. స్నేహితుడితో కలిసి..

|

May 25, 2023 | 2:39 PM

యంగ్‌ ట్యాలెంట్‌ను ప్రొత్సహించడంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. ఔత్సాహిక నటీ నటులకు అవకాశం కల్పించేందుకు గానూ తన స్నేహితుడు విక్రమ్‌తో కలిసి మరో ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించారు.

Ram charan: యంగ్‌ ట్యాలెంట్‌ను ప్రోత్సహించేందుకు రామ్‌ చరణ్‌ కీలక నిర్ణయం.. స్నేహితుడితో కలిసి..
Ram Charan
Follow us on

యంగ్‌ ట్యాలెంట్‌ను ప్రొత్సహించడంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. ఔత్సాహిక నటీ నటులకు అవకాశం కల్పించేందుకు గానూ తన స్నేహితుడు విక్రమ్‌తో కలిసి మరో ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ సంస్థ విక్రమ్‌ (విక్కీ), రామ్‌ చరణ్‌ మంచి ఫ్రెండ్స్‌ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఇప్పటికే కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లుగా కూడా వ్యవహరించారు. ఇప్పుడు ‘ వీ మెగా పిక్చర్స్‌’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు విక్రమ్‌- రామ్‌చరణ్‌. మొదటి ప్రాజెక్టులో భాగంగా అఖిల్‌తో కలిసి సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. కాగా కొత్త ప్రొడక్షన్‌ బ్యానర్‌ను స్థాపించిన రామ్‌చరణ్‌కు అభిమానులు, నెటిజన్లు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. కాగా కొణిదెల ప్రొడక్షన్‌ బ్యానర్‌ పేరుతో పలు సినిమాలు నిర్మించారు చెర్రీ. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్‌ 150, సైరా సినిమాలు ఈ బ్యానర్‌లో రూపుదిద్దుకున్నవే.

ఇక హీరోగా ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ అనే సినిమాలో నటిస్తున్నాడు రామ్‌ చరణ్‌. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, ఎస్‌ జే సూర్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్‌ స్వరాలు సమకరూస్తుండగా, దిల్‌ రాజు నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..