AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: ‘ అసలు నిజం బయటకు వస్తోంది’.. రాశీఖన్నా సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు

12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే, టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా ప్రధాన పాత్రధారులుగా నటించిన ఓ సినిమాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. కల్పిత కథనాలు ఎల్లకాలం దాగవని, నిజాలు బయటకు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.

PM Narendra Modi: ' అసలు నిజం బయటకు వస్తోంది'.. రాశీఖన్నా సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు
PM Narendra Modi
Basha Shek
|

Updated on: Nov 21, 2024 | 4:20 PM

Share

గోద్రా రైలు దుర్ఘటన నేటికీ వివాదాస్పదంగానే మిగిలిపోయింది. 2002లో జరిగిన ఆ ఘటన తర్వాత గుజరాత్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి. ఇప్పుడు ఇదే ఘటనపై బాలీవుడ్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా విడుదలైంది . ఇందులో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే, టాలీవుడ్ హీరోయిన్ రాఖీ ఖన్నా, రిద్ది డోగ్రా, బర్కా సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ధీరజ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరించింది. శుక్రవారం (నవంబర్ 15)న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోద్రా మారణకాండ జరిగినప్పుడు జరిగిన ఘటనను మీడియా ఎలా చిత్రీకరించిందనే ప్రధాన ఇతివృత్తంతో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఈ సినిమాని ఉద్దేశించి ఒక నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించిన మోడీ.. ‘కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయి. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

2002 గోద్రా రైలు ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఘటనలో మహిళలు, పిల్లలతో సహా సుమారు 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటన తర్వాత గుజరాత్ లో మతకల్లహాలు చెలరేగాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పుడిదే ఘటన ఆధారంగా ది సబర్మతీ రిపోర్ట్ ను తెరకెక్కించారు ధీరజ్ శర్మ. నవంబర్ 15న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఇప్పుడు స్వయంగా ప్రధాని మోడీనే ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే..
మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!