షూటింగ్ షురూ చేసిన నాగ శౌర్య.. అందమైన ఫోటోను షేర్ చేసిన చిత్రయూనిట్

| Edited By: Anil kumar poka

Jul 14, 2021 | 7:46 AM

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరితో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు..

షూటింగ్ షురూ చేసిన నాగ శౌర్య.. అందమైన ఫోటోను షేర్ చేసిన చిత్రయూనిట్
Ns22
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరితో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు.. ఆతర్వాత హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు ఈ హ్యాండ్సమ్ హీరో. సంతోష్ జాగర్లమూడి డైరెక్షన్ లో లక్ష్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా 8ఫ్యాక్ బాడీని డవలప్ చేసాడు. ఆతర్వాత వరుడు కావలెను అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా చకచకా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలోనే తన 22వ చిత్రాన్ని హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో టాలెంటెడ్ డైరెక్టర్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో  చేస్తున్నాడు. ఈ దర్శకుడు అలా ఎలా?’ .. ‘లవర్’ .. ‘ గాలి సంపత్’  వంటి సినిమాలను తెరకెక్కించాడు. షిర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే మొదలైన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెట్లో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో నాగ శౌర్య తన తల్లి ఉషా ని పట్టుకొని హీరోయిన్ షిర్లీ సెటియా – డైరెక్టర్ అనీష్ లతో కలిసి చిరు నవ్వులు చిందిస్తున్నారు. సీనియర్ నటి రాధిక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sonu Sood: ముంబైకి వచ్చే ముందు ఫిల్మ్ ఫేర్ పుస్తకం కొన్నా.. 20 ఏళ్ల తర్వాత కల నెరవేరింది అంటున్న సోనూ సూద్

Renu Desai: అతను నా వెనకుంటే.. ఈ ప్రపంచంలో ఏదీ నన్ను బాధించదు. ఆసక్తికర పోస్ట్‌ చేసిన రేణు దేశాయ్‌.

Balakrishna Akhanda: ఫైనల్‌ షెడ్యూల్‌ మొదలు పెట్టిన బాలయ్య.. నెట్టింట వైరల్‌ అవుతోన్న మేకింగ్‌ స్టిల్స్‌.