AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Lakshmi: మీ మీద గౌరవం పెరిగింది మేడమ్.. మంచు లక్ష్మి చేస్తోన్న గొప్ప పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు వారమ్మాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ముఖ్యంగా భావి భారత పౌరులైన విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్జీవో ద్వారా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తోంది.

Manchu Lakshmi: మీ మీద గౌరవం పెరిగింది మేడమ్.. మంచు లక్ష్మి చేస్తోన్న గొప్ప పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
Manchu Lakshmi
Basha Shek
|

Updated on: Jul 23, 2025 | 5:58 PM

Share

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి. నటిగా, నిర్మాతగా, హోస్ట్ గా, సింగర్ గా ఇలా ఎన్నో రంగాల్లో తన ప్రతిభను చాటుకుంది. అయితే గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది మంచు లక్ష్మి. తన నివాసాన్ని ముంబైకు మార్చుకుంది. అయితే ఈ మంచు వారమ్మాయి ఓ మంచి పనికి శ్రీకారం చుట్టింది. టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అనే స్వచ్చంద సంస్థను స్థాపించి పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటోంది. ఈ స్కూళ్లలోని క్లాసులను డిజిటల్ క్లాస్ రూమ్స్ గా తీర్చిదిద్దుతోంది. తన సొంత డబ్బులతో టీవీ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వందలాది ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న ఆమె వేలాది మంది విద్యార్థులకు స్మార్ట్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్ ను అందిస్తోంది.

తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించింది మంచు లక్ష్మి. ఈ జిల్లాలోని ఏకంగా 12 గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా కోటమిట్ట కృష్ణ మందిరం వీధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ కి వెళ్ళిన మంచు లక్ష్మికి అక్కడి విద్యార్థులు పూలు చల్లి స్వాగతం పలికారు. అనంతరం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోడలు శృతి రెడ్డిలతో కలిసి డిజిటల్ క్లాస్ రూమ్లను ప్రారంభించింది. అనంతరం అక్కడి విద్యార్థులతో సరదాగా ముచ్చటించింది. డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను స్టూడెంట్స్ కు వివరించింది.

ఇవి కూడా చదవండి

డిజటల్ క్లాస్ రూమ్స్ ను ప్రారంభిస్తోన్న మంచు లక్ష్మి..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీలో ‘ద ట్రైటర్స్’ అనే షోలో పాల్గొంది మంచు లక్ష్మి. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆమె నటించిన దక్ష.. ద డెడ్లీ కాన్‌స్పిరసి అనే సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇందులో పోలీస్ పాత్రలో కనిపించనుంది మంచు వారమ్మాయి. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

పూలు చల్లి మంచు లక్ష్మిక స్వాగతం పలికిన విద్యార్థులు.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?