AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malayalam Movie Industry: మలయాళ సినిమా ఇండస్ట్రీలో ముసలానికి కారణాలివే! టాలీవుడ్‌పైనా ప్రభావం!

ప్రస్తుతం భారతదేశంలో అగ్రశ్రేణి సినిమా పరిశ్రమగా మలయాళ సినీ ఇండస్ట్రీకి గుర్తింపు ఉంది. గతేడాది మాలీవుడ్ నుంచే అత్యధిక హిట్ సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు షట్ డౌన్ కానుంది. జూన్ 1 నుంచి సినిమా షూటింగులు ఆగిపోనున్నాయి. థియేటర్లు బంద్ కానున్నాయి.

Malayalam Movie Industry: మలయాళ సినిమా ఇండస్ట్రీలో ముసలానికి కారణాలివే! టాలీవుడ్‌పైనా ప్రభావం!
Malayalam Movie Industry
Basha Shek
|

Updated on: Feb 16, 2025 | 9:54 PM

Share

గత కొన్నేళ్లుగా మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద సంఖ్యలో హిట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. గత సంవత్సరం కూడా ‘మంజుమేల్ బాయ్స్’, ‘ఆవేశం’, ‘పాలం పలవుమ్’ తదితర మంచి సినిమాలు వచ్చాయి. అంతుకు ముందు 2023లోనూ ‘ఇరట్ట’, ‘నేరు’, ‘2018’, ‘రోమాంచనం’ వంటి హిట్ చిత్రాలు రిలీజయ్యాయి. ముఖ్యంగా కొవిడ్ తర్వాత ని మలయాళ చిత్ర పరిశ్రమ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే జూన్ 1 నుంచి మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమ మూతపడనుంది. గత సంవత్సరం అత్యధిక సూపర్ హిట్ చిత్రాలను నిర్మించినది మలయాళ చిత్ర పరిశ్రమ. పెద్ద హిట్స్ అందించినప్పటికీ, మలయాళ నిర్మాతలు గత సంవత్సరం దాదాపు 600 నుండి 700 కోట్లు నష్టపోయినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. నటులు సాంకేతిక నిపుణులు తమ రెమ్యునరేషన్లను భారీ మొత్తంలో పెంచారు. అంతేకాదు, ప్రభుత్వ పన్నుల కారణంగా కూడా ఆ సినిమా నుండి వచ్చే లాభాలు నిర్మాతలకు చేరడం లేదు. అందువల్ల, చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు అందరూ కలిసి బంద్ కు పిలుపు నిచ్చారు.

2024లో 200 మలయాళ సినిమాలు రిలీజయ్యాయి. కానీ వాటిలో 24 మాత్రమే విజయం సాధించాయి. ఫలితంగా, నిర్మాతలు దాదాపు 600-700 కోట్ల నష్టాన్ని చవిచూశారు. ఈ కారణంగా, మలయాళ చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు, ఇతర సంఘాలు ఒక సమావేశం నిర్వహించి జూన్ 1 నుంచి పూర్తి బంద్ పాటించాలని యోచిస్తున్నాయి.ఇదే సమయంలో స్టార్ నటుడు మోహన్ లాల్ నటించిన ‘L2’ తో సహా అనేక ఇతర స్టార్-స్టారేటెడ్ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సమయంలో సమ్మె సినిమాకు పెద్ద దెబ్బ అవుతుంది. కాబట్టి కొంతమంది నిర్మాతలు బంద్‌ను వ్యతిరేకిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రముఖ మలయాళ సినిమా నిర్మాత జి సురేష్ కుమార్ మాట్లాడుతూ, ‘నటులు, సాంకేతిక నిపుణులు తమ రెమ్యునరేషన్లను పదిరెట్లు పెంచుకున్నారు. జీఎస్టీ, వినోద పన్ను, ఇతర కారణాల వల్ల నిర్మాతలకు సినిమా నుండి లాభాలు అందడం లేదు. ఒక సినిమా 100 కోట్లు వసూలు చేస్తే, అన్ని పన్నులు చెల్లించిన తర్వాత నిర్మాతకు 27 కోట్లు మాత్రమే వెళ్తున్నాయి’ అని అన్నారు.

టాలీవుడ్ పైనా ప్రభావం !

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.