AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : చేసింది 7 సినిమాలే.. కానీ 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. ఆస్తులు రూ.830 కోట్లు..

దాదాపు 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. కానీ చేసింది కేవలం 7 సినిమాలు మాత్రమే. ఇప్పుడు నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.830 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు.. ? నటిగా ప్రశంసలు అందుకున్న ఆమెకు.. సినీరంగంలో అదృష్టం మాత్రం కలిసిరాలేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress : చేసింది 7 సినిమాలే.. కానీ 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. ఆస్తులు రూ.830 కోట్లు..
Meghna Gulzar )
Rajitha Chanti
|

Updated on: Dec 18, 2025 | 8:09 AM

Share

సినీరంగంలో గుర్తింపు రావాలంటే ప్రతిభతోపాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాల్సిందే. దాదాపు 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె.. చేసింది కేవలం 7 సినిమాలు మాత్రమే. ఆమె పేరు మేఘనా గుల్జాMeghna Gulzarర్. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకురాలు. ఆమె రూపొందించిన సినిమాలు అడియన్స్ హృదయాలు హత్తుకుంటాయి. దర్శకురాలు మేఘనా గుల్జార్ 23 సంవత్సరాలుగా బాలీవుడ్‌లో ఉన్నారు. ఆమె సినిమాలు ప్రతి పాత్ర, సన్నివేశానికి ప్రాణం పోస్తాయి. మేఘనా కథ రాయడం ప్రారంభించే ముందు, నెలల తరబడి సెర్చ్ చేస్తుంది. పాత్రల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటుంది. ప్రతి సన్నివేశాన్ని సాధ్యమైనంత వరకు వాస్తవికతకు దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.

ఘనా గుల్జార్ 2002లో టబు, సుష్మితా సేన్, ఆకాష్ ఖురానా నటించిన ‘ఫిల్హాల్’ చిత్రంతో దర్శకురాలిగా అడుగుపెట్టింది. ఈ సినిమా కేవలం రూ. 1.91 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ తర్వాత ఈషా డియోల్, ఫర్దీన్ ఖాన్ నటించిన ‘జస్ట్ మ్యారీడ్’ 2007 లో విడుదలైంది. ఈ చిత్రం పెద్దలు కుదిర్చిన వివాహంలో చిక్కుకున్న జంట గురించి. ఈ చిత్రం కేవలం రూ. 4.17 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 2015 లో ఆయన ‘తల్వార్’ సినిమా తీశారు. ఇది ఒక నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కించగా.. ఇర్ఫాన్ ఖాన్, కొంగోనా సేన్ శర్మ, నీరజ్ కబీ నటించారు. ఈ సినిమా మొత్తం కలెక్షన్ రూ. 30 కోట్లు దాటింది.

మేఘన 2018లో అలియా భట్, విక్కీ కౌశల్ నటించిన ‘రాజీ’ చిత్రంతో తన అతిపెద్ద విజయాన్ని సాధించింది. దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 138 కోట్లు వసూలు చేసింది. ఆ సంవత్సరం భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 2020లో యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా “ఛపాక్” చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, విక్రాంత్ మాస్సే, మధుర్జీత్ సర్కి నటించారు.ఆ తర్వాత సామ్ బహదూర్ సినిమాను నిర్మించారు. ప్రతి సినిమా నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించారు. దాదాపు 23 ఏళ్ల సినీప్రయాణంలో ఆమె కేవలం 7 సినిమాలు తెరకెక్కించింది. ఇప్పుడు ఆమె ఆస్తుల విలువ రూ.830 కోట్లు ఉన్నట్లు సమాచారం. మేఘన ఐదుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకురాలు. అంతేకాదు.. ఆమె ప్రముఖ రచయిత గుల్జార్ కుమార్తె.

ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

Follow Us