Virata Parvam: విప్లవ గీతానికి అనుహ్య స్పందన.. రానా పాడిన పాటను మీరు విన్నారా ?

| Edited By: Ravi Kiran

Jun 13, 2022 | 8:33 PM

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటించిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

Virata Parvam: విప్లవ గీతానికి అనుహ్య స్పందన.. రానా పాడిన పాటను మీరు విన్నారా ?
Virata Parvam
Follow us on

డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం (Virata Parvam) సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్‏కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటించిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరరెక్కించిన ఈ మూవీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉన్న ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో నిన్న ఛలో ఛలో విప్లవగీతాన్ని విడుదల చేశారు చిత్రయూనిట్. రానా పాడిన పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

మారదులే.. ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే అంటూ సాగే ఈ విప్లవగీతాన్ని హీరో రానా ఆలపించారు. ఆడబిడ్డ రక్షణకై పోరాటం.. దళితుడి ఆత్మగౌరవానికై పోరాటం… పేదోడి ముద్దకై పోరాటం.. ఎన్నాళ్లు.. ఇంకెన్నాళ్లు అంటూ వచ్చే చరణాలు రొమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ఈ పాటను జీలుకర శ్రీనివాస్ రాయగా.. సురేష్ బొబ్బిలి, రానా కలిసి ఆలపించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. నక్సలైట్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో నక్సలైట్ రవన్నగా రానా కనిపించనుండగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. అలాగే ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.